Asianet News TeluguAsianet News Telugu

కోడిగుడ్డు కోసం గొడవ: యువకుడిని చితకబాదిన రౌడీషీటర్లు

నిజామాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని సీసాలతో చితకబాదారు. నగరంలోని కోటగల్లికి చెందిన రాజు అనే యువకుడు స్థానిక సూపర్‌ మార్కెట్‌లో కోడిగుడ్డు కొనే విషయంలో అతనితో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు

Two rowdy sheeters attacked on man in nizamabad
Author
Nizamabad, First Published Apr 2, 2019, 10:15 AM IST

నిజామాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని సీసాలతో చితకబాదారు. నగరంలోని కోటగల్లికి చెందిన రాజు అనే యువకుడు స్థానిక సూపర్‌ మార్కెట్‌లో కోడిగుడ్డు కొనే విషయంలో అతనితో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు.

ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన ఇద్దరు రౌడీషీటర్లు రాజుపై దాడికి దిగారు. పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ సీసాలతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో రాజును ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ సంఘటనతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios