Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు ఇవే...

తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు సలహాలపై సమావేశంలో రెండు గంటల పాటు చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. పక్కా లెక్కలతోనే మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. 

trs party partial manifesto key notes
Author
Hyderabad, First Published Oct 16, 2018, 7:45 PM IST

హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీకి వచ్చిన వినతులు, సూచనలు సలహాలపై సమావేశంలో రెండు గంటల పాటు చర్చించినట్లు కేసీఆర్ తెలిపారు. పక్కా లెక్కలతోనే మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. 

ఓట్లు కోసం, ప్రలోభాల కోసం కాకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మేనిఫెస్టోను రూపొందిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. గత నాలుగేళ్ల అనుభవాలను పరిగణలోకి తీసుకుని మేనిఫెస్టో రూపొందించినట్లు తెలిపారు. మేనిఫెస్టోకమిటీకి 300కు పైగా వినతులు అందాయని తెలిపారు. కొన్ని పార్టీలకు ఎన్నికలు అంటే ఆట అయితే టీఆర్ఎస్ పార్టీకి ఒక టాస్క్ అన్నారు. 

టీఆర్ఎస్ పాక్షిక మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలు:

1. లక్ష రూపాయలు మళ్లీ రుణమాఫీ. 45.5లక్షల మందికి లబ్ధి. రెండు విడతలలోనే పూర్తిగా రుణమాఫీ 
2. రైతు బంధు పథకం పరిహారం రూ.10వేలుకు పెంపు. 
3. ప్రతీ రెండు నియోజకవర్గాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యునిట్‌. ఐకేపీ మహిళలకు నిర్వహణ బాధ్యత. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం.  
4. ఆసరా పెన్షన్ డబుల్. వయో పరిమితి 65ఏళ్ల నుంచి 57కు తగ్గింపు. ఆసరా పెన్షన్ రూ. 2016, వికలాంగ పెన్షన్ రూ. 3016లు. 
5. నిరుద్యోగ భృతి అమలు. నెలకు రూ. 3016 అందజేత  
6. సొంత స్థలం ఉన్నవారికి డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు. 
7. రూ.2వేల కోట్లతో ధరల స్థిరీకరణ
8. పేదరెడ్డి, ఆర్యవైశ్యుల కులాలకు ప్రత్యేకకార్పోరేషన్‌లు ఏర్పాటు
9. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక పథకాల రూపకల్పన
10.2లక్షల 60వేల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం
11.ఉద్యోగులకు మధ్యంతర భృతి

Follow Us:
Download App:
  • android
  • ios