తెలంగాణ గర్వించదగ్గ నటుడు వేణుమాధవ్: పీసీసీ చీఫ్ ఉత్తమ్ సంతాపం
వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్య నటుడు అంటూ కొనియాడారు. వేణుమాధవ్ మరణం సినీరంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వేణఉమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ఫష్టం చేశారు.
హైదరాబాద్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ మృతిచెందడంపై విచారం వ్యక్తం చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. వేణుమాధవ్ మరణం చాలా కలచివేసిందన్నారు.
వేణుమాధవ్ తెలంగాణ గర్వించదగ్గ హాస్య నటుడు అంటూ కొనియాడారు. వేణుమాధవ్ మరణం సినీరంగానికి తీరని లోటని పేర్కొన్నారు. వేణఉమాధవ్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ఫష్టం చేశారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఇకపోతే గత కొద్ది రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని యశోధ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వేణుమాధవ్ మధ్యాహ్నం 12:21 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఈ వార్తలు కూడా చదవండి
బ్రేకింగ్: ప్రముఖ హాస్యనటుడు వేణుమాధవ్ కన్నుమూత!
బూతులు ఉన్నాయనే సినిమాలు చేయలేదు.. వేణుమాధవ్!
ఛాన్సుల కోసం ఎవరినీ అడుక్కోను.. వేణుమాధవ్ కామెంట్స్!