Asianet News TeluguAsianet News Telugu

డెడ్‌లైన్ దాటితే ఉద్యోగాల్లోకి తీసుకోం.. ఆర్టీసీ ఇక లేనట్లే: తేల్చిచెప్పిన కేసీఆర్

రేపు అర్ధరాత్రి లోగా విధులకు హాజరుకాని కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకోరాదని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డెడ్‌లైన్ దాటాక ఏ ఒక్క కార్మికుడిని విధుల్లోకి తీసుకోబోమని అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని కేసీఆర్ తేల్చిచెప్పారు. 

telangana cm kcr review meeting on rtc strike
Author
Hyderabad, First Published Nov 4, 2019, 8:51 PM IST

ఉద్యోగాలు కాపాడుకోవడం పూర్తిగా ఆర్టీసీ కార్మికుల చేతిలోనే ఉందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆర్టీసీ సమ్మె, కార్మికులకు డెడ్‌లైన్‌ అంశంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు.

ఈ భేటీలో భాగంగా రేపు అర్ధరాత్రి లోగా విధులకు హాజరుకాని కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకోరాదని కేసీఆర్ అధికారులను ఆదేశించారు. డెడ్‌లైన్ దాటాక ఏ ఒక్క కార్మికుడిని విధుల్లోకి తీసుకోబోమని అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని కేసీఆర్ తేల్చిచెప్పారు.

తెలంగాణ ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారితే కార్మికులే ముమ్మాటికీ కారణమని.. యూనియన్ నాయకులు కార్మికులను మభ్యపెడుతున్నారని సీఎం మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5 వేల రూట్లలో ప్రైవేట్ వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. 

ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని కార్మిక శాఖ నివేదిక ఇచ్చిందన్నారు. ప్రభుత్వానికి హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇచ్చే పరిస్ధితి లేదని.. తీర్పు మరోలా వుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని కేసీఆర్ తెలిపారు. ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్తే అంతులేని పోరాటం చేయాల్సి వస్తుందన్నారు. 

Also Read:5వ తేదీ అర్ధరాత్రి వరకే డెడ్‌లైన్: ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్ ఫైనల్ ఛాన్స్

యూనియన్ల మాయలో పడి కుటుంబాల్ని చెడగొట్టుకోవద్దని నవంబర్ 5లోపు బేషరతుగా ఉద్యోగాల్లో చేరాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్. కేబినెట్ సమావేశం అనంతరం భేటీ వివరాలను ముఖ్యమంత్రి మీడియాకు వెల్లడించారు.

ఈ అవకాశాన్ని ఆర్టీసీ కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఒకవేళ ఐదవ తేదీ అర్ధరాత్రిలోగా కార్మికులు విధుల్లో చేరకపోతే మిగిలిన 5 వేల బస్సుల్ని కూడా ప్రైవేటుకిచ్చేస్తామని సీఎం హెచ్చరించారు.

ఈ అశకాశం కూడా చేజార్చకుంటే ఎవరూ ఏమీ చేయలేరని కేసీఆర్ తెలిపారు. మీ కుటుంబాలను రోడ్డున పడనివ్వొద్దని.. ఫైనల్ ఛాన్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని సీఎం సూచించారు. మూడు రోజుల్లోగా ఉద్యోగంలోకి చేరి భవిష్యత్‌ను కాపాడుకోవాలన్నారు.

Also Read:ఆర్టీసీ విలీనం లేదు.. 5,100 ప్రైవేట్ బస్సులకు అనుమతి: సీఎం కేసీఆర్

ఐదో తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే మీకు టైమ్ ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. కేబినెట్ సమావేశంలో మొత్తం 49 మంది అంశాలపై చర్చ జరిగిందన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. 5,100 ప్రైవేట్ బస్సులకు రూట్ పర్మిట్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసిందన్నారు.

ఆర్టీసీ కార్మికులు బాధ్యతారహితంగా సమ్మె చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. వీలినం చేయకూడదని కేబినెట్లో నిర్ణయం తీసుకున్నామని.. ఇది వ్యక్తి నిర్ణయం కాదని, కేబినెట్ నిర్ణయమని సీఎం తెలిపారు.

సుధీర్ఘంగా చర్చించే విలీనం సరికాదని నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ 10,400 బస్సులు నడుపుతోందని.. ఆర్టీసీ బస్సుల్లో 2,100 బస్సులు ప్రైవేట్ వ్యక్తులవేనని.. మరో 3 వేల బస్సులకు కాలం చెల్లిపోయిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios