చిన్నప్పటి నుంచి కలిసిమెలసి: ఒకే వ్యక్తితో ఇద్దరి పెళ్లి, ఒకేసారి మరణం
కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. సుజాత, సులోచన అనే ఇద్దరూ అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లిచేసుకుని అందరూ కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో అక్కాచెల్లెళ్లు మరణించారు. వివరాల్లోకి వెళితే.. సుజాత, సులోచన అనే ఇద్దరూ అక్కాచెల్లెళ్లు ఒకే వ్యక్తిని పెళ్లిచేసుకుని అందరూ కలిసి ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం కరీంనగర్-వరంగల్ హైవేపై శంకరపట్నం మండలం కొత్తగట్టు దగ్గర గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. దీంతో వీరి గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్ధానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.