ఎన్నిసార్లు ఫోన్ చేసినా జయరామ్ స్పందించలేదు: పద్మశ్రీ
మా జీవితంలో ఇక మళ్లీ సంతోషకరమైన రోజులు వస్తున్నాయని భావించాం.. కొత్తగా కాంట్రాక్టు వచ్చింది.ఈ విషయాన్ని షేర్ చేసుకొనేందుకు ఫోన్ చేసినా కూడ ఆయన స్పందించలేదని జయరామ్ భార్య పద్మశ్రీ గుర్తు చేసుకొన్నారు.
హైదరాబాద్: మా జీవితంలో ఇక మళ్లీ సంతోషకరమైన రోజులు వస్తున్నాయని భావించాం.. కొత్తగా కాంట్రాక్టు వచ్చింది.ఈ విషయాన్ని షేర్ చేసుకొనేందుకు ఫోన్ చేసినా కూడ ఆయన స్పందించలేదని జయరామ్ భార్య పద్మశ్రీ గుర్తు చేసుకొన్నారు.
గురువారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పలు విషయాలను వెల్లడించారు. కొత్తగా అమెరికాలో తమ కంపెనీకి కాంట్రాక్టు వచ్చిందన్నారు. ఈ విషయాన్ని షేర్ చేసుకోనేందుకు తాను పలుమార్లు జయరామ్కు కూడ ఫోన్ చేసినట్టు పద్మశ్రీ గుర్తు చేసుకొన్నారు.
జయరామ్ తాను ఎన్ని సార్లు ఫోన్ చేసినా కూడ స్పందించలేదన్నారు.రోజుకూ కనీసం 10 నుండి 15 దఫాలు తామిద్దరం ఫోన్లో మాట్లాడుకొంటామన్నారు.కంపెనీ సమావేశాల్లో ఉంటే తాను తర్వాత మాట్లాడుతానని మీటింగ్లో ఉన్నానని తనకు మేసేజ్ పెట్టేవాడని పద్మశ్రీ గుర్తు చేసుకొన్నారు.
నా కొడుకు కూడ జయరామ్కు ఫోన్ చేసినా స్పందించలేదన్నారు. అయితే ఎంతకీ ఫోన్ తీయకపోవడంతో ఇంటి వద్ద పనిచేసే వారికి ఫోన్ చేసినట్టు ఆమె చెప్పారు.బెడ్రూమ్లో స్పృహ లేకుండా జయరామ్ పడిపోయారా అనే అనుమానంతో తలుపులు బద్దలు కొట్టాలని కూడ కోరినట్టు చెప్పారు. కానీ, అయితే జయరామ్ బయటకు వెళ్లి తిరిగి రాలేదని వాచ్మెన్ చెప్పాడన్నారు.దీంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకొనట్టు చెప్పారు.
జయరామ్ మంచి విజన్ ఉన్న వ్యక్తిగా పద్మశ్రీ గుర్తు చేసుకొన్నారు.30 ఏళ్ల తమ దాంపత్య జీవితంలో శిఖా చౌదరిని కంపెనీలకు దూరంగా ఉంచాలని తాను గొడవ పడిన సందర్భం మినహా ఏనాడూ తమ మధ్య ఇబ్బందులు లేవన్నారు.
తనను ఆప్యాయంగా పద్మ అంటూ జయరామ్ పిలిచేవాడని ఆమె గుర్తు చేసుకొన్నారు. పిల్లలను బాగా చదివించాలనే కోరిక ఆయనకు ఉండేదన్నారు. తమ కూతురు మంచి యూనివర్శిటీలో సీటు వచ్చిందన్నారు. కానీ, తండ్రి చనిపోయిన విషయం తెలిసి పిల్లలిద్దరూ కూడ తట్టుకోలేకపోతున్నారని చెప్పారు.
సంబంధిత వార్తలు
అలా చెప్పడంతో కీడును శంకించింది: జయరామ్ భార్య
భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన
శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య
ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ
జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ
పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు
జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ
జయరామ్ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్
జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే
19 గంటలు నిర్భంధం: జయరామ్కు రాకేష్ చిత్రహింసలు
శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య
శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య
జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు
జయరామ్ హత్య కేసులో ట్విస్ట్లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్
జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు
శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ
హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు
చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...
జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్
జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?
గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి
జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి
రాకేష్ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి
జయరామ్ మర్డర్ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?
జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం
వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం
జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు
జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..
జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...
శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్
జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి
చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్
హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?
చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?