పాతబస్తీలో యువకుడి దారుణ హత్య, వెంటాడి చంపిన ప్రత్యర్థులు
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఛత్రినాక సాయిబాబా నగర్కు చెందిన రాకేశ్ కుమార్ జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఛత్రినాక సాయిబాబా నగర్కు చెందిన రాకేశ్ కుమార్ జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు.
ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి తమ్ముణ్ణి బైక్పై తీసుకెళ్తుండగా కాపు కాసిన దుండగులు.. కత్తులు, హాకీ స్టిక్కులతో రాకేశ్ కుమార్ను వెంటాడారు. అనంతరం మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి బండరాయితో మోదీ హత్య చేశారు.
ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువుల పైనా వారు దాడి చేశారు. అర్థరాత్రి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాతకక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.