Asianet News TeluguAsianet News Telugu

పాతబస్తీలో యువకుడి దారుణ హత్య, వెంటాడి చంపిన ప్రత్యర్థులు

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఛత్రినాక సాయిబాబా నగర్‌కు చెందిన రాకేశ్ కుమార్ జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. 

murder in old city hyderabad
Author
Hyderabad, First Published Jan 30, 2019, 7:59 AM IST

హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఛత్రినాక సాయిబాబా నగర్‌కు చెందిన రాకేశ్ కుమార్ జీహెచ్ఎంసీ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

ఈ క్రమంలో మంగళవారం అర్థరాత్రి తమ్ముణ్ణి బైక్‌పై తీసుకెళ్తుండగా కాపు కాసిన దుండగులు.. కత్తులు, హాకీ స్టిక్కులతో రాకేశ్ కుమార్‌ను వెంటాడారు. అనంతరం మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి బండరాయితో మోదీ హత్య చేశారు.

ఈ దారుణాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన బంధువుల పైనా వారు దాడి చేశారు. అర్థరాత్రి నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాతకక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios