ఆర్మీ సెలక్షన్స్లో విషాదం...కరెంట్ వైర్లు తగిలి యువకుడి దుర్మరణం
ఆర్మీలో ఉద్యోగం సంపాదించి దేశరక్షణలో పాలుపంచుకోవాలనుకున్న ఓ యవకుడు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ మౌలాలీలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ వద్ద టెరిటోరియల్ ఆరమీ సెలక్షన్స్ కోసం వచ్చిన ఓ యువకుడు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
ఆర్మీలో ఉద్యోగం సంపాదించి దేశరక్షణలో పాలుపంచుకోవాలనుకున్న ఓ యవకుడు అధికారుల నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయాడు. సికింద్రాబాద్ మౌలాలీలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ వద్ద టెరిటోరియల్ ఆరమీ సెలక్షన్స్ కోసం వచ్చిన ఓ యువకుడు విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు.
వివరాల్లోకి వెళితే... టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్స్లో భాగంగా సోమవారం ఉదయం సైనికాధికారులు పరుగు పందెం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వనపర్తికి చెందిన ఓ యువకుడు రోడ్డుపై పరిగెడుతుండగా అతనికి విద్యుత్ తీగలు తగిలాయి.
దీంతో సదరు యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తమతో పాటు సెలక్షన్స్ కోసం వచ్చిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాద వాతావరణం చోటుచేసుకుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే యువకుడు మరణించాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.