Asianet News TeluguAsianet News Telugu

కామన్ సెన్స్ కూడా లేదు.. మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్

కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నారంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్ అయ్యారు.

ktr fire on new agency on social media over fake news
Author
Hyderabad, First Published Jan 22, 2019, 11:30 AM IST

కామన్ సెన్స్ లేకుండా వార్తలు రాస్తున్నారంటూ ఓ ప్రముఖ మీడియా సంస్థపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై ఓ పత్రిక రాసిన వార్తపై కేటీఆర్ ఈ విధంగా మండిపడుతున్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే... తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం యాగం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. లోక్ సభ ఎన్నికల్లో విజయం కోసం.. ప్రధాన మంత్రి కావాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఈ యాగం చేస్తున్నారంటూ ఓ ఇంగ్లీష్ పత్రిక వార్తను ప్రచురించింది.

కాగా.. ఈ న్యూస్ పై ఓ నెటిజన్.. కేసీఆర్ ప్రధాని పదవి కోసం యాగాలు చేయడం లేదని.. ఇలాంటి వార్తలు నిరాధారం అంటూ ట్వీట్ చేసి.. ఆ ట్వీట్ కి కేటీఆర్ ని కూడా ట్యాగ్ చేశారు.

దీంతో.. ఆ న్యూస్ పై కేటీఆర్ కూడా స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు నిజానిజాలు తెలుసుకోకుండా.. కామన్ సెన్స్ లేకుండా వార్తలు ప్రచురిస్తున్నాయన్నారు. ఇలాంటి వార్తలను పబ్లిష్ చేయడాన్ని సంబంధిత ఎడిటర్ల విజ్ఞతకే వదిలేస్తున్నాంటూ ట్వీట్ చేశారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios