Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ ఫలితాల గొడవ: ఎట్టకేలకు కదిలిన కేసీఆర్

ఇంటర్ ఫలితాల విషయాల్లో చోటు చేసుకొన్న వివాదాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు  క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
 

kcr meeting with educaion deapartment officials in hyderabad
Author
Hyderabad, First Published Apr 24, 2019, 3:57 PM IST


హైదరాబాద్:ఇంటర్ ఫలితాల విషయాల్లో చోటు చేసుకొన్న వివాదాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ బుధవారం నాడు  క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

ఈ నెల 18వ తేదీన విడుదలైన ఇంటర్ పరీక్ష ఫలితాలపై అనేక వివాదాలు నెలకొన్నాయి. ఇప్పటికే 20కు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి.

ఈ తరుణంలో  సీఎం సమీక్ష నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి  జనార్ధన్ రెడ్డి, ఇంటర్ బోర్డు సెక్రటరీ  ఆశోక్  పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఇంటర్ ఫలితాలపై నెలకొన్న వివాదాలపై ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదికను రెండు రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశంలో ఈ వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

విద్యాశాఖలో వివాదాలు: జగదీష్ రెడ్డి పాలిట శాపం

ఆగని ఆత్మహత్యలు: మరో విద్యార్ధిని బలవన్మరణం, 20కి చేరిన మరణాలు

సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ నేతల యత్నం, అరెస్ట్

తెలంగాణలో మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య... రైలుకిందపడి దారుణం

ఇంటర్‌బోర్డు చెలగాటం: విద్యార్ధుల ఆత్మహత్యలతో ‘‘తెలంగాణ తల్లి’’ గుండెకోత

మాస్ హిస్టీరియాతోనే విద్యార్థుల ఆత్మహత్యలు: అశోక్ వితండవాదం

దిద్దకుండానే మార్కులు వేస్తారా: ఇంటర్ బోర్డుపై పేరేంట్స్ ఫైర్

జిల్లా ఫస్ట్, ఫస్టియర్‌లో 98 మార్కులు: సెకండియర్‌లో జీరో

తెలంగాణ ఇంటర్ ఫెయిల్: సీఎం రమేశ్ మేనల్లుడు ఆత్మహత్య (వీడియో)

ఇంటర్ బోర్డు వద్ద ఉద్రిక్తత: విద్యార్ధి సంఘాల ఆందోళన

Follow Us:
Download App:
  • android
  • ios