Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ శాసనమండలిలో జీవన్ రెడ్డి... ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్  హవా కొనసాగగా ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆ పార్టీ ఎదురుగాలి వీచింది. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటమిపాలయ్యారు.  టీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా వుండే మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి విజయం సాధించారు. 

Jeevan Reddy Oath Taking at Telangana Legislative Council
Author
Hyderabad, First Published Apr 22, 2019, 3:18 PM IST

తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన ప్రతి ఎన్నికలో టీఆర్ఎస్  హవా కొనసాగగా ఒక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే ఆ పార్టీ ఎదురుగాలి వీచింది. ఇటీవల జరిగిన ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్సీలు ఓటమిపాలయ్యారు.  టీఆర్ఎస్ ప్రాబల్యం ఎక్కువగా వుండే మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి, సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి విజయం సాధించారు. 

Jeevan Reddy Oath Taking at Telangana Legislative Council

అయితే ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వెంటనే లోక్ సభ ఎన్నికల హడావుడి మొదలవడంతో ఆయన తన బాధ్యతలు స్వీకరించలేకపోయారు. ఇటీవలే ఆ ఎన్నికలు కూడా ముగియడంతో జీవన్ రెడ్డితో సోమవారం ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేయాలని భావించారు. ఈ మేరకు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటి చైర్మన్ నేతి విద్యాసాగర్ సమక్షంలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులుతో పాటు కాంగ్రెస్ నాయకులు జానారెడ్డి, చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Jeevan Reddy Oath Taking at Telangana Legislative Council

కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా మూడో స్థానానికి పరిమితమయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  కాంగ్రెస్, బీజేపీ, సీపీఎంలు సాధారణ ఎన్నికల్లో లాగా ఎమ్మెల్యేలు, మంత్రులు, అగ్రనేతలతో తమ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించాయి. దీంతో మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల స్థానం నుండి జీవన్ రెడ్డి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి అలుగుబెల్లి నర్సిరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి అభ్యర్థి కూర రఘోత్తంరెడ్డి విజయం సాధించారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios