Asianet News TeluguAsianet News Telugu

ఔటర్ రింగ్ రోడ్డులో ప్రమాదం.. బస్సు ఢీకొని దంపతులు మృతి

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై శుభకార్యానికి వెళ్తున్న భార్య భర్తల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. 

couple died in a road accident at Outer Ring Road
Author
Hyderabad, First Published Oct 31, 2019, 10:56 AM IST

తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పెద్ద అంబర్‌పేట్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో దంపతులు మృతి చెందారు. మృతులను అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడ వాసులుగా పోలీసులు గుర్తించారు. 

couple died in a road accident at Outer Ring Road

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బైక్ పై శుభకార్యానికి వెళ్తున్న భార్య భర్తల్ని ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మృతులు పెద్ద అంబర్ పేట్ కోహెడకు చెందిన బొక్క రమణారెడ్డి, విజయమ్మగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన బస్సు పశ్చిమగోదావరి జిల్లా తుని డిపోకి చెందినదిగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. 

couple died in a road accident at Outer Ring Road

Follow Us:
Download App:
  • android
  • ios