శక్తిపీఠం సెంటిమెంట్: ఆలంపూర్ నుండి కాంగ్రెస్ ప్రచారం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు శక్తి పీఠమైన ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి గురువారం నాడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు శక్తి పీఠమైన ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుండి గురువారం నాడు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లాలోని ఆలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని తలపెట్టింది. త్వరలోనే రాహుల్గాంధీతో కూడ సభలను ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్ రెడ్డి ఇతర ముఖ్య నేతలు ప్రత్యేక హెలికాప్టర్లో హైద్రాబాద్ నుండి అక్టోబర్ 4 వ తేదీన ఆలంపూర్కు చేరుకొంటారు. ఆలంపూర్ లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
శక్తీపీఠంగా ఆలంపూర్ ప్రసిద్ది చెందిన పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం నుండి ప్రచారం ప్రారంభించడం ద్వారా తమకు కలిసివస్తోందని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. తొలుత కాంగ్రెస్ పార్టీ నేతలు ఆలంపూర్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీన కేసీఆర్ హుస్నాబాద్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అక్టోబర్ మూడో తేదీన నిజామాబాద్, నాలుగో తేదీన నల్గొండ, ఐదో తేదీన వనపర్తి సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
శక్తిపీఠం నుండి ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభించనుంది. అయితే ఈ శక్తి పీఠం సెంటిమెంట్ ఏ మేరకు ఆ పార్టీకి కలిసివస్తోందో ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
సంబంధిత వార్తలు
ఆ స్థానాల్లో టీఆర్ఎస్కు చుక్కలు చూపుతాం: కొండా సురేఖ
6 నియోజకవర్గాల్లో కాదు కదా.. 6 డివిజన్లలో కూడా.. కొండాకు అంత సీన్ లేదు
సత్తా చూపుతాం: కాంగ్రెస్లో చేరిన కొండా దంపతులు
కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్
దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ
15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?
నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు