Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ అధిష్టానం షాక్: వారికి టికెట్టు లేనట్టే...

గత  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులకు వ్యతిరేకంగా రెబెల్‌గా బరిలోకి దిగిన  వారికి ఈ దఫా పార్టీ టిక్కెట్లను  కేటాయించకూడదని కాంగ్రెస్ పార్టీ అదిష్టానం నిర్ణయం తీసుకొంది

congress decides to not give tickets who contested as rebel candidates in 2014 elections
Author
Hyderabad, First Published Nov 6, 2018, 2:42 PM IST


హైదరాబాద్: గత  ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్తులకు వ్యతిరేకంగా రెబెల్‌గా బరిలోకి దిగిన  వారికి ఈ దఫా పార్టీ టిక్కెట్లను  కేటాయించకూడదని కాంగ్రెస్ పార్టీ అదిష్టానం నిర్ణయం తీసుకొంది. మంగళవారం నాడు కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు  నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

ఈ దఫా తెలంగాణలో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని భావిస్తోంది  దీంతో వ్యూహత్మకంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది.  ప్రజా కూటమి(మహా కూటమి)ని ఏర్పాటైంది. ఈ  కూటమిలో కాంగ్రెస్‌తో పాటు సీపీఐ, టీజేఎస్,  టీడీపీలున్నాయి.

 కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో  మంగళవారం నాడు జరిగింది. ఈ సమావేశంలో  గత ఎన్నికల్లో రెబెల్స్‌గా పోటీచేసిన వారికి టిక్కెట్లు కేటాయించకూడదని  నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం.

గత ఎన్నికల్లో పార్టీ ప్రకటించిన అధికార అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసినవారు సుమారు 15 మంది అభ్యర్థులు ఉంటారు.గత ఎన్నికల్లో  ఏ స్థానం నుండి ఎవరెవరు రెబెల్స్‌గా బరిలోకి దిగారనే విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  జాబితాను రూపొందించింది.

ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేస్తే 15 మంది ఆశవాహులకు టిక్కెట్లు గల్తంతయ్యే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు సామాజిక వర్గాల వారీగా ప్రాధాన్యత ఇవ్వాలని కూడ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భావిస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని ఆ పార్టీ  అభిప్రాయంతో ఉంది.

ఓసీల్లో రెడ్డి, వెలమ, కమ్మ, బ్రహ్మణ, ఆర్వవైశ్య సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని  ఆ పార్టీ నాయకత్వం  యోచిస్తోంది. మరో వైపు మైనార్టీలకు కూడ టిక్కెట్ల కేటాయింపులో  ప్రాధాన్యతను కల్పించాలని కూడ ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.మరో వైపు తెలంగాణలో కనీసం 40 సీట్లు బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది.

ఇప్పటికే  57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే  అభ్యర్థుల జాబితాను  కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసింది. ఇవాళ మరో 40 అసెంబ్లీ నియోజవకర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులను ఫైనల్ చేయనుంది. ఒక్కో నియోజకవర్గం నుండి రెండు లేదా మూడు పేర్లను స్క్రీనింగ్ కమిటీ ఫైనల్ చేయనుంది.ఈ జాబితా ఆధారంగా నవంబర్ 8వ తేదీన రాహుల్ గాంధీ అభ్యర్థులను ఫైనల్ చేయనున్నారు.

సంబంధిత వార్తలు

కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ: సీపీఐ, టీజేఎస్‌లను ముంచుతారా తేల్చుతారా?

 

ప్రజా కూటమి: కాంగ్రెస్ నేతలతో కోదండరామ్ భేటీ, రమణ, చాడ గైర్హాజర్

కాంగ్రెస్‌కు షాక్: 9 స్థానాల్లో పోటీకి సీపీఐ సై, మూడు రోజుల్లో అభ్యర్థుల ప్రకటన

పొత్తులపై వీడని ఆశ: కోదండరామ్ మాట ఇదీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: సీపీఐ ఎమర్జెన్సీ మీటింగ్, కాంగ్రెస్‌పై గుర్రు

ప్రజా కూటమిలో లుకలుకలు: చాడ సీరియస్ కామెంట్స్

నా చుట్టూ చర్చ జరగొద్దు: రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్

రాహుల్‌గాంధీతో కోదండరామ్ భేటీ: టీజేఎస్‌‌కు స్వల్ప ఊరట

సర్ధుబాటుపై పీటముడి: ప్రజా కూటమిలో సీట్ల బేరసారాలు

ప్రజా కూటమి సీట్ల సర్ధుబాటు ఖరారు: కాంగ్రెస్ 95, టీడీపీకి 14

ప్రజాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌తో ఇక తాడోపేడో

కాంగ్రెస్ లీకులపై అసంతృప్తి: టీడీపీ, సీపీఐ, టీజేఎస్ నేతల భేటీ

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: టీజేఎస్‌, సీపీఐకి కాంగ్రెస్‌ షాక్

ప్రజా కూటమికి బీటలు: సీట్ల సర్దుబాటుపై పీటముడి

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: రంగంలోకి చంద్రబాబు

హైదరాబాద్ కు చంద్రబాబు: మరికాసేపట్లో టీడీపీ నేతలతో సమావేశం

టీ-టీడీపీలో సీట్ల లొల్లి:రోడ్డెక్కిన కార్యకర్తలు

టీజేఎస్‌తో కాంగ్రెస్ చర్చలు: కోదండరామ్ కోరుతున్న సీట్లీవే

కోదండరామ్‌‌కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

మహాకూటమి సీట్ల సర్ధుబాటు జానారెడ్డికి, రాహుల్ సభలు

మహాకూటమి కాదు ప్రజాకూటమి... మార్పుకు కారణమిదేనా?

మహా కూటమిలో సీట్ల లొల్లి: కోదండరామ్ తో చాడ, రమణ భేటీ

మహాకూటమిలో సీట్ల లొల్లి: పట్టువీడని కోదండరామ్

మహా‌ కొలిమి: కోదండరామ్ కొర్రీలు

నాన్చొద్దు.. త్వరగా తేల్చండి:సీట్ల సర్ధుబాటుపై కోదండరామ్

మహాకూటమికి టీజేఎస్ ఝలక్: కోదండరామ్ అల్టిమేటం

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మిత్రులకు కాంగ్రెస్ ఇచ్చే సీట్లు ఇవే: కోదండరామ్ సర్దుబాటు

మహాకూటమి ఇక తెలంగాణ పరిరక్షణ వేదిక

మహాకూటమిలో సీట్ల లొల్లి: కాంగ్రెస్‌పై అసంతృప్తి

వచ్చే నెల 11నే అభ్యర్థుల జాబితా: ఢీల్లీకి ఉత్తమ్

కొడుకు కోసం ఢిల్లీకి జానా: రాహుల్‌ కరుణించేనా?

 

 

Follow Us:
Download App:
  • android
  • ios