Asianet News TeluguAsianet News Telugu

వీడని సస్పెన్ష్...గోషామహాల్ చంద్రముఖి ఏమైంది: విషయం హైకోర్టుకి

తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించిన గోషామహాల్ బీఎల్ ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు. క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. చంద్రముఖిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆమె ఎక్కడికౌనా వెళ్లిందా అన్న కోణంలో  పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. 

blf candidate chandramukhi missing case
Author
Hyderabad, First Published Nov 28, 2018, 12:45 PM IST

హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా కలకలం సృష్టించిన గోషామహాల్ బీఎల్ ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి కిడ్నాప్ మిస్టరీ ఇంకా వీడలేదు. క్షణక్షణం ఉత్కంఠ నెలకొంది. చంద్రముఖిని ఎవరైనా కిడ్నాప్ చేశారా లేక ఆమె ఎక్కడికౌనా వెళ్లిందా అన్న కోణంలో  పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటికే పలు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఎల్ ఎఫ్ అభ్యర్థి చంద్రముఖి మిస్సింగ్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. మరోవైపు చంద్రముఖి మిస్సింగ్ ఘటనపై తల్లి హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె కిడ్నాప్ కు గురైందంటూ హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు. 
 
ఇకపోతే తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఏకైక ట్రాన్స్ జెండర్ అభ్యర్థి చంద్రముఖి. అన్ని పార్టీలతోపాటు చంద్రముఖి కూడా తన ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. అయితే ఒక్కసారిగా ఆమె మిస్సింగ్ అవ్వడం అటు బీఎల్ఎఫ్ అభ్యర్థులతోపాటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రంలోగా చంద్రముఖి ఆచూకీ లభించకపోతే ఎన్నికల కార్యాలయం దగ్గర ధర్నాకు దిగుతామని బీఎల్ ఎఫ్ అభ్యర్థులు చెప్తున్నారు. 

హైదరాబాద్ గోషామహల్ లో బీఎల్ఎఫ్ పార్టీ అభ్యర్థిగా చంద్రముఖి బరిలో దిగుతున్నారు. చంద్రముఖి బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఇందిర నగర్లో నివసముంటున్నారు. అయితే నవంబర్ 27 తెల్లవారు జామున రాత్రి మూడు గంటల నుండి ఆమె కనిపించడంలేదంటూ తోటి ట్రాన్స్ జెండర్స్ బంజారాహిల్స్ పొలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. 

ఇద్దరూ గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారు జామున 3 గంటలకు తమ ఇంటికి వచ్చారని మాట్లాడే పనుందని చెప్పి చంద్రముఖిని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అలా తీసుకెళ్లిన ఆమెను ఇప్పటివరకు తీసుకురాలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇకపోతే  కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చంద్రముఖి కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఆమెను తెలిసినవారే కిడ్నాప్ చేసి వుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అటు గోషామహల్ నియోజకవర్గం నుంచి తాజా మాజీ ఎమ్మెల్మే రాజాసింగ్ బిజెపి అభ్యర్థిగా, సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ  మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 

ఇలాంటి రాజకీయ ఉద్దండులతో పోటీ పడుతూ అందరి దృష్టి ఆకర్షిస్తున్న ట్రాన్స్ జెండర్ చంద్రముఖి మిస్సింగ్ అవ్వడం సంచలనంగా మారింది. మరోవైపు చంద్రముఖి సెల్ ఫోన్ ఆధారంగా కొంత క్లూస్ లభించినట్లు బంజారాహిల్స్ పోలీసులు చెప్తున్నారు. సాయంత్రం లోగా చంద్రముఖి మిస్సింగ్ కేసును ఛేదిస్తామని చెప్తున్నారు.  

 

 

Follow Us:
Download App:
  • android
  • ios