ధోనీ రన్నౌట్... మ్యాచ్ లో టెన్షన్, మండిపడుతున్న ఫ్యాన్స్
హైదరాబాద్ వేధికగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అందరిలోనూ ఉత్కంఠ రేపిన విషయం ఒక్కటే... అది దోనీ ఔట్ అయ్యాడా లేదా అని. అసలు ఈ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఉత్కంఠభరితంగానే సాగింది
హైదరాబాద్ వేధికగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో అందరిలోనూ ఉత్కంఠ రేపిన విషయం ఒక్కటే... అది దోనీ ఔట్ అయ్యాడా లేదా అని. అసలు ఈ మ్యాచ్ మొదలైనప్పటి నుంచి ఉత్కంఠభరితంగానే సాగింది. చివరి బంతి వరకు విజయం ఎవరిని వరిస్తుందో తెలియని టెన్షన్ మ్యాచ్ చూస్తున్న ప్రతి ప్రేక్షకుడిలోనూ ఉంది.
ముఖ్యంగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ రన్నౌట్ నిర్ణయాన్ని థర్డ్ అంపైర్కు అప్పగించడం.. మ్యాచ్లో తీవ్ర ఉత్కంఠ రేపింది. బెస్ట్ మ్యాచ్ ఫినిషర్గా పేరొందిన ధోనీ.. ఆట గెలిచే అవకాశం ఉన్న సమయంలో రన్నౌట్ అయ్యాడా? లేదా? అన్నది తేల్చే బాధ్యత థర్డ్ అంపైర్పై పడింది.
హార్దిక్ పాండ్యా వేసిన 13వ ఓవర్ రెండో బంతిని స్ట్రయికింగ్లో ఉన్న షేన్ వాట్సన్ షార్ట్ ఫైన్లెగ్లో దిశగా తరలించాడు. దీంతో సింగిల్ వచ్చింది. అయితే, అక్కడ ఉన్న లసిత్ మలింగా ఓవర్త్రో విసరడంతో మరొక పరుగు కోసం ఇద్దరు ప్రయత్నించారు. బంతిని వేగంగా అందుకున్న ఇషాన్ కిషన్ బౌలర్స్ ఎండ్ వైపుగా ఉన్న స్టంప్స్కు నేరుగా విసిరాడు.
బంతి వికెట్లకు తగలడంతో తీర్పు ఇచ్చే బాధ్యతను థర్డ్ అంపైర్కు అప్పగించారు. థర్డ్ అంపైర్ నిగేల్ లాంజ్ వివిధ కోణాల్లో విశ్లేషణ జరిపేందుకు సమయం తీసుకున్నాడు. ఒక కోణంలో ధోనీ బంతి వికెట్లకు తగలకముందే లైన్ను దాటినట్టు కనిపించింది. మరో కోణంలో మాత్రం లైన్కు కొద్దిగా అటు-ఇటు ఉన్నట్టు కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్గా ప్రకటించాడు.
ఈ నిర్ణయం పెండింగ్లో ఉన్నంతసేపు క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారిపోయింది. ధోనీని ఔట్ అని ప్రకటించడంతో చెన్నై అభిమానులు ఉసూరుమన్నారు. అయితే.. దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు ఎదురౌతున్నాయి. అసలు ధోనీ రన్నౌట్ కాకపోయినా.. లైన్ దాటినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించకపోయినా.. ఔట్ ఇచ్చారని చెన్నై అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
సింగిల్స్ తీయడంలో సిద్ధహస్తుడైన ధోనీ రన్నౌట్ కావడమన్నది అత్యంత అరుదు అని చెప్పాలి. ఈ సీజన్లో చివరిసారిగా ముంబై ఇండియన్స్పై మ్యాచ్లోనే ధోనీ రన్నౌట్ అయ్యాడు.
MS Dhoni run-out! Out or Not out? https://t.co/dkrfpPHQ2V via @ipl
— Shubham Pandey (@21shubhamPandey) May 13, 2019