ఐపీఎల్ లో విరాట్ రికార్డ్
టీం ఇండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...ఐపీఎల్ లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు చేసి ఐపీఎల్ లో 5వేల పరుగులు పూర్తి చేశాడు.
టీం ఇండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ...ఐపీఎల్ లో కొత్త రికార్డు సృష్టించాడు. ముంబయితో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ లో 46 పరుగులు చేసి ఐపీఎల్ లో 5వేల పరుగులు పూర్తి చేశాడు. ఈ ఘనత సాధించిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ సురేశ్రైనా కోహ్లీ కన్నా ముందున్నాడు. రైనా 178 మ్యాచుల్లో 5034 పరుగులు చేయగా కోహ్లీ 165 మ్యాచుల్లో ఐదు వేల పరుగులు చేసి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
గురువారం ముంబయితో మ్యాచ్కు ముందు కోహ్లీ ఐదు వేల క్లబ్కు 46 పరుగుల దూరంలో ఉన్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్శర్మ, హార్దిక్ పాండ్య మెరుపు బ్యాటింగ్తో బెంగళూరు ముందు భారీ లక్ష్యం నిర్దేశించింది. దీంతో లక్ష్య ఛేదనకు దిగిన కోహ్లీసేన 181 పరుగులు చేసి 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో కోహ్లీ సరిగ్గా 46 పరుగులు చేసి 5000 క్లబ్లో చేరాడు.