Asianet News TeluguAsianet News Telugu

మరీ ఇంతటి పతనమా...30 ఏళ్ల తర్వాత ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా ఇప్పుడు వరుస వివాదాలతో, సీనియర్ ఆటగాళ్లు లేక పతనావస్థకు చేరుకుంది. ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆసీస్ ఓటమి దిశగా సాగుతోంది

sydney test: After 30 Years australia playing follow on
Author
Sydney NSW, First Published Jan 6, 2019, 12:06 PM IST

ఒకప్పుడు వరుస విజయాలతో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆస్ట్రేలియా ఇప్పుడు వరుస వివాదాలతో, సీనియర్ ఆటగాళ్లు లేక పతనావస్థకు చేరుకుంది. ప్రస్తుతం బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో ఆసీస్ ఓటమి దిశగా సాగుతోంది.

తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకే అలౌటై ఫాలోఆన్‌ గండాన్ని తప్పించుకోలేకపోయింది. ఇలా సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడటం 30 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారంటే ఆ జట్టు ఎలాంటి పరిస్ధితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

1988లో సిడ్నీ గ్రౌండ్‌లోనే ఇంగ్లాండ్‌తో ఫాలో ఆన్ ఆడిన ఆసీస్ ఆ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.. దేశానికి అవతల కూడా చివరగా 2005లో ట్రెండ్ బ్రిడ్జ్‌లో ఇంగ్లాండ్‌పైనే ఫాలో ఆన్ ఆడగా ఆ మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి పాలైంది.

ప్రస్తుతం భారత్ 322 పరుగుల భారీ ఆధిక్యంలో ఉంది.. వర్షం కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేశారు. ఇంకా ఒక రోజు ఆట మిగిలి ఉంది. ఈ మ్యాచ్ డ్రా అయినా సిరీస్‌లో ఇప్పటికే 2-1 తేడాతో ఆధిక్యంలో ఉన్న కోహ్లీసేనకే సొంతం కానుంది. తద్వారా ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరిస్ నెగ్గిన తొలి భారత జట్టుగా రికార్డు సృష్టించనుంది.

 

సిడ్నీ టెస్టు: రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఆస్ట్రేలియా

‘‘పంత్.. ధోనీని దాటేస్తాడు’’

కేఎల్ రాహుల్ నిజాయితి... అంపైర్ ప్రశంసలు

సిడ్నీ టెస్టులో కోహ్లీకి అవమానం...

ఆసిస్ సెలెక్టర్లకు బుర్ర లేదు: విరుచుకుపడ్డ షేన్‌వార్న్

ధోని పాకిస్థాన్ రికార్డును బద్దలుగొట్టిన పంత్.... 12ఏళ్ల తర్వాత

Follow Us:
Download App:
  • android
  • ios