మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్
భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ని టీ20 మ్యాచ్ కి దూరం చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
భారత మహిళల జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ని టీ20 మ్యాచ్ కి దూరం చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. జట్టుకోసం ఎంతో కృషి చేసిన తనను ఘోరంగా అవమానిచారంటూ మంగళవారం బీసీసీఐకి మిథాలీ రాజ్ మొయిల్ చేశారు. కాగా.. ఈ విషయంపై భారత మాజీ క్రికెటర్ ఫరూఖ్ ఇంజినీర్ స్పందించారు.
‘‘ విజయం దిశగా దూసుకుపోతున్న భారత మహిళల క్రికెట్ జట్టులో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. మిథాలీ చాల గొప్ప క్రికెటర్. ఎన్నో సార్లు తన అద్భుతమైన ప్రదర్శనతో జట్టుని ముందుకు నడిపించింది. అలాంటి ఆమెపై వేటు వేశారు. ఆమె పట్ల ఇలా వ్యవహరించడం చాలా దారుణం. అప్పటి అవసరాల దృష్ట్యా ఆమెను జట్టుకి దూరం చేసి ఉండొచ్చు. కానీ ఆమెను బెంచ్ కి పరిమితం చెయ్యడం మాత్రం నిజంగా చాలా దారుణం. ఆమె ఎంతో మానసిక క్షోభ అనుభవించి ఉంటుంది..’’ అని ఫరూక్ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
read more news
అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ
మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్పై బీసీసీఐ ఆగ్రహం
హర్మన్ ప్రీత్ కౌర్ పై మిథాలి రాజ్ మేనేజర్ సంచలన కామెంట్స్
పరుగుల రాణి: మిథాలీరాజ్ డ్రాప్ వెనక ఆయనే...
టీ20 ప్రపంచకప్: మిథాలీ ఉంటే గెలిచేవాళ్లం..హర్మన్పై అభిమానుల ఫైర్
నో రిగ్రెట్స్: మిథాలీని పక్కన పెట్టడంపై కౌర్
క్రికెట్లో సంచలనం..ఇండియాలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ సనత్ జయసూర్య..?
బీసీసీఐ ఆదేశాలను పట్టించుకోని షమి.. చెప్పిందేంటి..? చేసిందేంటీ..?
గ్రౌండ్లోనే కాదు... కోర్టులోనూ పాక్పై మనదే గెలుపు
రోహిత్,కోహ్లీలను వెనక్కినెట్టిన మిథాలీ...ఇప్పుడు గప్టిల్ ను కూడా...