సిడ్నీ టెస్టుకు ఇండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ కి టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది.
ఆస్ట్రేలియాతో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ కి టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 13మంది సభ్యులతో ప్రకటించిన జట్టుకి కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే, కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, హనుమ విహారి, రిషబ్ పంత్, జడేజా, కుల్ దీప్ యాదవ్, రవి చంద్రన్ అశ్విన్, షమి, బుమ్రా, ఉమేష్ యాదవ్ ల పేర్లను ప్రకటించింది.
ఈ మేరకు బుధవారం బీసీసీఐ ట్వీట్ కూడా చేసింది. ఈ నాలుగో టెస్టుకి అశ్విన్ అందుబాటులో ఉండేదీ లేనిది రేపు తెలియజేస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఈ మ్యాచ్ సిడ్నీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. సిరిస్ లో భారత్ 2-1 తేడాతో ఆధిక్యంలో ఉంది.
స్టార్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మకి ఇటీవల కూతురు జన్మించింది. ఈ క్రమంలో ఆయన ఇండియా వెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ నాలుగో టెస్టుకి ఆయన దూరంగా ఉంటున్నారు.
read more news
సిడ్నీ టెస్ట్కు ముందు భారత్కు షాక్
మెల్బోర్న్ టెస్టులో టీమిండియా రికార్డుల మోత
బుమ్రా దెబ్బ: ఇండియా చేతిలో ఆస్ట్రేలియా చిత్తు
వరల్డ్ కప్ జట్టు ఎంపికపై కోహ్లీ సూచన...వ్యతిరేకించిన ధోనీ
ఆరంగేట్ర మ్యాచ్లో మయాంక్ అదిరిపోయే రికార్డు...సునీల్ గవాస్కర్ తర్వాత
పైన్ పై రిషబ్ పంత్ ప్రతీకారం: వెన్నెల కిశోర్ స్పందన
అంబటి రాయుడిని చూసి భయపడిన ధోనీ
కెప్టెన్గా గంగూలీ సరసన కోహ్లీ
అతని బౌలింగ్ అంటే భయం.. నేను ఆడలేను: కోహ్లీ