Asianet News TeluguAsianet News Telugu

లండన్ లో ఘనంగా టీఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు

ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

trs victory celebrations in london
Author
Hyderabad, First Published Dec 19, 2018, 10:47 AM IST

లండన్ లో టీఆర్ఎస్ విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో పార్టీ కార్యకర్తలు, కేసీఆర్ అభిమానులు పాల్గొన్నారు.

ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు మరియు కార్యదర్శి సత్యమూర్తి చిలుముల ఆద్వర్యం లో  జరిగిన ఈ వేడుకల్లో ముందుగా తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ గారి చిత్ర పటానికి పూలతో నివాళుర్పించి, అమరవీరులని స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించారు.అనంతరం కేకును కట్ చేసి ఆనందోత్సాలతో విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు.

ఈ సంధర్భంగా ఎన్నారై టి.ఆర్.ఎస్.సెల్ యూకే ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు  మాట్లాడుతూ లండన్ లో టీఆర్ఎస్ విజయోత్సవ వేడుకలు జరుపుకుంటున్నందుకు సంతోషంగా ఉందని.. టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారం లోకి తెచ్చిన తెలంగాణ ప్రజలకు, పార్టీ అభ్యర్ధులని ముందుండి గెలిపిచ్చిన కెసిఆర్ కి, పార్టీ కార్యకర్తలు, నాయకులకు కృతఙ్ఞతలు తెలిపారు. 

కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో లండన్ నుండి ప్రత్యేక బృందం నెలరోజులకు పైగా రాష్ట్రమంతటా పర్యటించి ప్రచారం నిర్వహించిన అనిల్ కూర్మాచలం మరియు అశోక్ గౌడ్ దుసారి బృందానికి ప్రత్యేక కృతజ్ఞతాభినందనాలు తెలిపారు.అలాగే  కేటీఆర్ నూతన కార్యనిర్వాహణ అధ్యక్షుడి గా నియమించచడం తమకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. 

కార్యదర్శి సృజన రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయమని, పార్టీ గెలుపుకి కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతఙ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రిగా రెండవసారి బాధ్యతలు చేపట్టిన కెసిఆర్ కి శుభాకాంక్షలు తెలిపారు. 

కార్యదర్శి సత్య చిలుముల మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి కెసిఆర్  చేసిన ఆభివృద్ధి పనులు,సంక్షేమ కార్యక్రమాలే  టీఆర్ఎస్ పార్టీని విజయపథం లో నిలిపాయని, ప్రజలంతా విజ్ఞతతో వ్యవహరించి సరైన నాయకత్వాన్ని ఎన్నుకున్నారని, ప్రజలందరికి శుభాకాంక్షలు తెలిపారు. కెసిఆర్ ని రెండవ సారి ముఖ్యమంత్రిగా చూడడం సంతోషంగా ఉందని, తెలంగాణ ప్రజలంతా అదృష్టవంతులని ఇక రాష్ట్రం మరింత ప్రగతి తో ముందుకు వెళ్తుందని తెలిపారు. కేటీఆర్ ని నూతన కార్యనిర్వాహణ అధ్యక్షుడి గా నియమించిన కెసిఆర్కి కృతఙ్ఞతలు తెలిపారు. 

ఈ వేడుకల్లో హాజరైన టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి  కంది మాట్లాడుతూ ఎన్నారైలంతా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకున్నారని, కెసిఆర్ నాయకత్వాన్ని కేవలం రాష్ట్ర ప్రజలే కాదు నేడు దేశ ప్రజలు  కూడా కోరుకుంటున్నారన్నారు. 

trs victory celebrations in london

ఇతర నాయకులు శ్రీకాంత్ జెల్లా, సురేష్ గోపతి, మధు, గణేష్ మరియు నవీన్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ఘనవిజయం తెలంగాణ చారిత్రాత్మక అవసరమని, ప్రజలంతా కెసిఆర్  వెంటే ఉన్నారని మరొక్కసారి రుజువైందని, ఇక కెసిఆర్ సేవలు దేశానికి అవసరమని, రాబోయే ఎంపీ ఎన్నికల్లో సైతం రాష్ట్రానికి వచ్చి ప్రచారం నిర్వహించి పార్టీ గెలుపుకి కృషి చేస్తామని తెలిపారు. 

ఈ వేడుకల్లో ఎన్నారై  టీఆర్ఎస్ సెల్ యూకే  ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ పెద్దిరాజు ,  టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీఆర్ఎస్ యూకే  కార్యదర్శి సృజన రెడ్డి మరియు సత్యమూర్తి చిలుముల, శ్రీకాంత్ జెల్లా,  దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, ప్రవీణ్ వీర, మధుసూదన్ రెడ్డి,  హరి నవపేట్,  మల్లా రెడ్డి, సురేష్ గోపతి, నవీన్ మాదిరెడ్డి, రవి ప్రదీప్, గణేష్ పాస్తం,సురేష్ బుడగం,నవీన్ భువనగిరి, భాస్కర్ రావు, సత్యపాల్ రెడ్డి, రవి కుమార్ రేటినేని, అశోక్ అనంతగిరి, ప్రశాంత్, రామకృష్ణ,  రాకేష్ పటేల్, వంశీ పొన్నం, శ్రీనివాస్ మేకల, మహేందర్,  సతీష్,  లత కూర్మాచలం, స్వాతి బుడగం, సుప్రజ పులుసు, మమత జక్కీ ,శ్వేతా మహేందర్, శైలజ జెల్ల, అపర్ణ, శ్రీ లక్ష్మి, దీపాక్షర   తదితరులు పాల్గొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios