Asianet News TeluguAsianet News Telugu

అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద మృతి

అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. న్యూజెర్సీ సమీపంలోని ఎడిషన్‌లో ఉంటున్న మణిదీప్ అనే వ్యక్తి గురువారం మరణించాడు. 

telugu doctor suspected death in america
Author
newjersey, First Published Mar 29, 2019, 9:29 AM IST

అమెరికాలో తెలుగు వైద్యుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. న్యూజెర్సీ సమీపంలోని ఎడిషన్‌లో ఉంటున్న మణిదీప్ అనే వ్యక్తి గురువారం మరణించాడు. మృతుడి స్వస్థలం కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు తాలుకా గాంధీనగర్‌.

ఇతని తల్లిదండ్రులు నందిగం శ్రీనివాస్, పద్మలు. మణిదీప్ మణిపాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి... ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. ఎడిషన్‌లోని సెంట్ పీటర్స్ టీచింగ్ హాస్పిటల్‌లో పీజీ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు.

ఈ క్రమంలో గురువారం అతను అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు స్థానికంగా ఉన్న బంధువులు మణిదీప్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios