Asianet News TeluguAsianet News Telugu

ఫెస్టివ్ సీజన్: పోటాపోటీగా ఇలా స్మార్ట్ ఫోన్ల ఆవిష్కరణ

పండుగ సీజన్​ నేపథ్యంలో స్మార్ట్​ ఫోన్ తయారీ సంస్థలు ఇటీవల సరికొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేశాయి. అందులో బడ్జెట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ విడుదల చేసిన రెడ్ మీ 8ఎ కూడా ఉంది.
 

Mobile Phones Companies Released new divises
Author
New Delhi, First Published Sep 29, 2019, 11:19 AM IST

పండుగ సీజన్​తోపాటు మార్కెట్లో పెరుగుతున్న పోటీని ఎదుర్కొనేందుకు ఇటీవల భారీగా స్మార్ట్ ఫోన్లను విడుదల చేశాయి దిగ్గజ సంస్థలు. భారీ అంచనాల మధ్య ఈ ఫోన్లు విడుదలయ్యాయి. ఈ వారం విడుదలైన ప్రీమియం ఫోన్లలో భారీ అంచనాల మధ్య విడుదలైన వాటిలో వన్​ప్లస్ 7టీ​ ముందు వరుసలో ఉంది. 

ఇప్పటికే మార్కెట్లో ఉన్న వన్​ప్లస్​ 7కు కొనసాగింపుగా వన్​ప్లస్​ 7టీని తెచ్చింది ఈ సంస్థ. 8జీబీ ర్యామ్​ విత్ 128 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ, 8జీబీ ర్యామ్​ విత్ 256 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీతో 2వేరియంట్లలో ఈ మోడల్​ను తెచ్చింది వన్​ప్లస్​.

ఈ ఫోన్ల ధరలు వరుసగా రూ.37,999గా, రూ.39,999గా నిర్ణయించింది. ఈ ఫోన్​ అమెజాన్​లో నేటి నుంచి కొనుగోళ్లకు అందుబాటులోకి వచ్చింది.

వన్​ప్లస్​ 7టీ ఫోన్‌ 6.55 అంగుళాల ఫ్లూయిడ్​ అమెలోయిడ్​ డిస్​ప్లే కలిగి ఉంటుంది. ఇంకా 48+16+12 ఎంపీలతో వెనుకపైపు మూడు కెమెరాలు, 16 ఎంపీల సెల్ఫీ కెమెరాను అమర్చారు.

3,800 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ కలిగి ఉంది. ఇంకా స్నాప్​డ్రాగన్ 855, ప్లస్ ప్రాసెసర్​ ఆండ్రాయిడ్ వీ (10క్యూ) ఆధారిత ఆక్సీజన్ ఓఎస్​ ఉన్నాయి. 

ఇక మూడు కెమెరాలతో చైనా ఫోన్ల తయారీ సంస్థ లెనోవో బడ్జెట్ సెగ్మెంట్​లో మూడు కెమెరాలతో ఇటీవల కొత్త మోడల్​ను విడుదల చేసింది. కే10 ప్లస్​ పేరుతో మార్కెట్లోకి విడుదలైన ఈ ఫోన్​ 3 జీబీ ర్యామ్​ విత్ 64 జీబీ రామ్​ ఇంటర్నల్ స్టోరేజీతో అందుబాటులోకి తెచ్చింది.

దీని ధర రూ.10,999గా నిర్ణయించింది లెనోవో. సెప్టెంబర్​ 30 నుంచి కొనుగోళ్లకు అందుబాటులో ఉండనుంది ఈ ఫోన్​. లెనోవో కే10 ప్లస్​ ఫోన్ 6.22 అంగుళాల హెచ్​డీ ప్లస్​ డిస్​ప్లే కలిగి ఉంటుంది.

ఆక్టాకోర్​ 632 క్వాల్​కామ్​ స్నాప్​ డ్రాగన్ ప్రాసెసర్‌తోపాటు 13 ఎంపీ+5ఎంపీ+ 8ఎంపీలతో వెనుకవైపు మూడు కెమెరాలు (ఏఐ అనుసంధానం), 16 మెగా పిక్సల్​ సెల్ఫీ కెమెరా, 4,050 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్​ సపోర్ట్ కలిగి ఉంటుంది. 

రెండు సెల్ఫీ కెమెరాలతో చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం వివో సరికొత్త ప్రీమియం స్మార్ట్​ఫోన్​ను ఇటీవల ఆవిష్కరించింది. వీ17 ప్రో పేరుతో 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజీ సామర్థ్యంతో ఈ ఫోన్​ అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ.29,900గా నిర్ణయించింది వివో. ఈ ఫోన్ ఇప్పటికే కొనుగోళ్లకు అందుబాటులో ఉంది.

వివో వీ17 ప్రో ఫోన్ 6.44 అంగుళాల డిస్ ప్లేతోపాటు 32+8 మెగాపిక్సెల్‌ పాప్‌-అప్‌ సెల్ఫీ కెమెరాలు కలిగి ఉంది. వెనుక 48+13+8+2 ఎంపీలతో వెనుకవైపు నాలుగు కెమెరాలు కూడా అమర్చారు. 4100 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ దీని సొంతం. క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌ ఈ ఫోన్‌లో ఫీచర్ ఏర్పాటు చేశారు. 

బడ్జెట్ స్మార్ట్ ఫోన్లతో వినియోగదారులకు ఎక్కువగా ఆకర్షించే షియోమీ సరికొత్త మోడల్​ రెడ్​ మీ 8ఏ ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రెడ్​ మీ 8ఏ పేరుతో స్మార్ట్ దేశ్​కా ధమ్​దార్ అనే నినాదంతో ఈ ఫోన్​ను పరిచయం చేసింది. 

రెడ్ మీ 8ఎ ఫోన్‌లో 2 జీబీ ర్యామ్​ విత్ 32 జీబీ రామ్​ ఇంటర్నల్ స్టోరేజీ, 3 జీబీ ర్యామ్ విత్ 32 జీబీ రామ్ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్లలో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.6,499గా, రూ.6,999గా నిర్ణయించింది రెడ్​ మీ. ఈ ఫోన్ సెప్టెంబర్ 30 నుంచి కొనుగోళ్లకు అందుబాటులోకి రానుంది.

రెడ్​ మీ 8ఏ ఫోన్ 6.22 అంగుళాల డాట్​ నాచ్ డిస్​ప్లే కలిగి ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. క్వాల్​కామ్​ స్నాప్​డ్రాగన్ 439 ప్రాసెసర్, 12 ఎంపీల ఏఐ రియర్​ కెమెరాతోపాటు 8 మెగా పిక్సెల్​ సెల్ఫీ కెమెరా అమర్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios