హైదరాబాద్ లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్ కు ప్రమాదం
హైదరాబాద్ లో అదుపుతప్పిన ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్
ఈ రోజు హైదరాబాద్ కాప్రా సర్కిల్ కుషాయిగూడలో నాగార్జున నగర్ నుండి నాచారం వెళుతున్న నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సు అదుపు తప్పి పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. అదృష్ట వశాత్తు పూర్తిగా బోల్తా పడలేదు. బస్సులో 11 మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు ఎటువంటి గాయాలు కాలేదు, అనంతరం మరో బస్సు లో విద్యార్థులు స్కూలుకు వెళ్లి పోయారు.