Asianet News TeluguAsianet News Telugu

ఉత్తర ప్రదేశ్‌లో ఘోరం...ట్రక్కు చక్రాల కింద నలిగి 8 మంది మృతి

ఉత్తర ప్రదేశ్ లో నూతన సంవత్సర ఆరంభంలోనే విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం 8 మంది అమాయకులను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంత తీవ్రంగా గాయపడ్డారు.  ఈ దుర్ఘటన చందౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. 

 

 

uttar pradesh road accident
Author
Uttar Pradesh, First Published Jan 1, 2019, 8:58 PM IST

ఉత్తర ప్రదేశ్ లో నూతన సంవత్సర ఆరంభంలోనే విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యం 8 మంది అమాయకులను బలి తీసుకుంది. ఈ ప్రమాదంలో మరికొంత తీవ్రంగా గాయపడ్డారు.  ఈ దుర్ఘటన చందౌలీ జిల్లాలో చోటుచేసుకుంది. 

చందౌలీ జిల్లా కేంద్రంలో ఓ ట్రక్కు అదుపుతప్పి రోడ్డుపక్కనే వున్న ఓ దళిత వాడలోకి దూసుకుపోమయింది. దీంతో ట్రక్కు కింద నలిగి 8 మంది అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. మృతిచెందిన వారిలో నలుగురు చిన్నారులు వున్నారు. అలాగే మరికొంత మంది చిన్నారులు కూడా ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని మొదట ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  ప్రమాదానికి ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యపు డ్రైవింగే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.   

Follow Us:
Download App:
  • android
  • ios