మహిళల అయ్యప్ప దర్శనం.. స్పందించిన కేరళ సీఎం
ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు దర్శించుకోవడంపై కేరళ ముఖ్య మంత్రి పనరయి విజయన్ స్పందించారు.
ప్రముఖ పుణ్య క్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామిని బుధవారం ఉదయం ఇద్దరు మహిళలు దర్శించుకోవడంపై కేరళ ముఖ్య మంత్రి పనరయి విజయన్ స్పందించారు.
ఇద్దరు మహిళలు ఈరోజు అయ్యప్పస్వామి ఆలయంలోకి ప్రవేశించిన మాట వాస్తవమేనని సీఎం విజయన్ తెలిపారు. బుధవారం ఉదయం పోలీసుల రక్షణతో ఆ ఇద్దరు మహిళలు అయ్యప్పను దర్శించుకున్నారని వారు తెలిపారు.
గతేడాది శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతి ఇస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాగా.. వారిని ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు. తాజాగా.. బుధవారం ఇద్దరు మహిళలు ఆలయంలోకి వెళ్లి అయ్యప్పను దర్శించుకోవడంతో మరోసారి వివాదం తలెత్తింది.
read more news
అయ్యప్ప దర్శనం అనంతరం.. డ్యాన్స్ లు చేసిన మహిళలు
శబరిమలలోకి మహిళలు.. ఆలయం మూసివేత
శబరిమలలోకి ఇద్దరు మహిళల ఆలయ ప్రవేశం (వీడియో)
అయ్యప్పని దర్శించుకున్న మహిళ.. పరారీలో భర్త