Asianet News TeluguAsianet News Telugu

#Exit polls రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ సర్వే : మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమిదే హవా

రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ నిర్వహించిన సర్వేలో మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమికి మరోసారి అధికారం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. సర్వే ప్రకారం బీజేపీ కూటమి 135 నుంచి 142 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి 33, కాంగ్రెస్‌కి 11, శివసేనకు 24, ఎన్సీపీకి 15, ఇతరులు 16 శాతం ఓట్లు దక్కనున్నాయని సర్వే తెలిపింది. 

Republic tv exit polls on maharashtra assembly elections
Author
New Delhi, First Published Oct 21, 2019, 6:49 PM IST

రిపబ్లిక్ టీవీ-జన్‌కీ బాత్ నిర్వహించిన సర్వేలో మహారాష్ట్రలో శివసేన-బీజేపీ కూటమికి మరోసారి అధికారం దక్కే అవకాశం ఉందని వెల్లడించింది. సర్వే ప్రకారం బీజేపీ కూటమి 135 నుంచి 142 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది. బీజేపీకి 33, కాంగ్రెస్‌కి 11, శివసేనకు 24, ఎన్సీపీకి 15, ఇతరులు 16 శాతం ఓట్లు దక్కనున్నాయని సర్వే తెలిపింది. 

బీజేపీ: 135-142
శివసేన: 81-88
కాంగ్రెస్: 24-20

మహారాష్ట్ర లో బీజేపీ శివసేనల 'మహాయుతి' కూటమి కాంగ్రెస్-ఎన్సీపీల 'మహా అగాధి' తో తలపడుతోంది. దాదాపుగా 3,237మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కేవలం 235మంది మాత్రమే మహిళా అభ్యర్థులు బరిలో ఉన్నారు. 288 స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికలకు 96,661 పోలింగ్ బూతులు ఏర్పాటు చేసారు. పూర్తి ఎన్నికల విధుల్లో 6.5 లక్షల మంది సిబ్బంది నిమగ్నమయ్యారు. 

Read more #exitpolls: మహారాష్ట్రలో బీజేపీ హవా, వార్ వన్ సైడ్ ... ఏబీపీ సి ఓటర్ సర్వే...

బీజేపీ అగ్రనాయకత్వం అంతా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నుండి మొదలుకొని అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్ తో సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. జాతీయత నే ప్రధాన అజెండాగా బీజేపీ ప్రచారం సాగింది. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్షాలను టార్గెట్ చేసారు. 

మరోపక్క ప్రతిపక్ష పార్టీలేమో ఇతి కేంద్రంలోను, ఇటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీని దుమ్మెత్తిపోశాయి. వారి అసమర్థత వల్లే దేశంలో నిరుద్యోగం తాండవిస్తోందని, దేశంలోని ఆర్ధిక సంక్షోభానికి వారి అనాలోచిత నిర్ణయాలైన నోట్ల రద్దు,జీఎస్టీలే కారణమని రాహుల్ గాంధీ సహా ఇతర విపక్ష నేతలు విరుచుకు పడ్డారు. 

Read more సీఎన్ఎన్- న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: మళ్లీ మహారాష్ట్ర బీజేపీదే...

ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నాయకత్వంలో రెండోసారి అధికారం చేపట్టేందుకు తహ తహలాడుతున్న బీజేపీ శివసేన తోని పొత్తు పెట్టుకున్న విషయం మనకు తెలిసిందే. పొత్తుల్లో భాగంగా బీజేపీ 164 సీట్లలో పోటీ చేస్తుండగా శివ సేన 126 సీట్లలో పోటీకి దిగింది. మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీల పొత్తులో భాగంగా కాంగ్రెస్ 147 స్థానాల్లో పోటీ చేస్తుండగా,ఎన్సీపీ 121 స్థానాల్లో పోటీకి దిగింది.

మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలు కేవలం ఒక దఫాలోనే ఎన్నికలకు వెళ్లాయి. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం, మహారాష్ట్రలోని దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం కొనసాగుతాయా లేదా అనే విషయం 24వ తేదిన జరగనున్న కౌంటింగ్ రోజు తెలియనుంది.

ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీని ప్రజలు పార్లమెంటు ఎన్నికల్లో ఆదరించిన స్థాయిలోనే ఆదరిస్తారా, లేదా కాంగ్రెస్ తన మిత్రపక్షాలతో కలిసి ఎమన్నా సుర్ప్రైజ్ ఇస్తుందా అనే విషయం కూడా అదే రోజు తేలనుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios