మోడీ సర్కార్పై వ్యాఖ్యలు: రాహుల్కు ఈసీ నోటీసులు
చౌకీదారు వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన ఘటన మరువక ముందే ఈసీ కూడ రాహుల్కు నోటీసులు జారీ చేసింది. మోడీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఈసీ ఈ నోటీసులను గురువారం నాడు జారీ చేసింది.ః
న్యూఢిల్లీ: చౌకీదారు వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన ఘటన మరువక ముందే ఈసీ కూడ రాహుల్కు నోటీసులు జారీ చేసింది. మోడీ ప్రభుత్వంపై రాహుల్ చేసిన వ్యాఖ్యల విషయంలో ఈసీ ఈ నోటీసులను గురువారం నాడు జారీ చేసింది.ః
గిరిజనులను కాల్చిపారేసేలా మోడీ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకురానుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ఈ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. లేకపోతే చర్యలు తీసుకొంటామని ఈసీ చెప్పింది.
ఈ ఏడాది ఏప్రిల్ 23వ తేదీన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షాదోల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ గాంధీ బీజేపీ సర్కార్ పై విమర్శలు చేశారు. గిరిజను కోసం మోడీ తీసుకొచ్చే చట్టం గురించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గిరిజనులను కాల్చిపారేసేలా పోలీసులకు అనుమతి కల్పిస్తూ ఈ చట్టాన్ని రూపొందిస్తున్నారని రాహుల్ ఈ సభలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్తలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఈసీ ఈ మేరకు గురువారం నాడు రాహుల్కు నోటీసులు జారీ చేసింది.