Asianet News TeluguAsianet News Telugu

దారుణం..నవవధువుపై శోభనం గదిలోనే భర్త సహా ఏడుగురు రేప్

శోభనం రోజు తన భార్యకు పాలలో మత్తుమందు కలిపి తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరవాత గదిలోకి తీసుకెళ్లి ఒకరి తరవాత ఒకరు భర్త, అతని సోదరుడు, బావ, నలుగురు తాంత్రికులు అత్యాచారం చేశారు. 

Newly wed woman allegedly gang raped by husband's relatives and a tantrik in Haryana
Author
Hyderabad, First Published Sep 29, 2018, 4:22 PM IST

ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతికి.. చేదు అనుభవం మిగిలింది. పెళ్లి రోజే దారుణాతి దారుణ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. భర్త సహా.. ఏడుగురు వ్యక్తులు ఆమె అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ సంఘటన హర్యానాలోని కురుక్షేత్రలో  చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కురుక్షేత్రలోని బాబెయిన్ ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల అమ్మాయికి సెప్టెంబర్ 12వ తేదీ రాత్రి వివాహం జరిగింది. సెప్టెంబర్ 13న నవ దంపతులకు శోభనం ఏర్పాటుచేశారు. అయితే అప్పటికే ఆ అమ్మాయి భర్త తాంత్రిక పూజలు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. 

తాంత్రిక పూజలో భాగంగా నలుగురు తాంత్రికులను పిలిపించాడు. ఈ పూజలో తన తల్లిదండ్రులు, సోదరి, బావ, సోదరుడు కూడా పాల్గొనాలని సూచించాడు. ఈ పూజలో భాగంగానే సెప్టెంబర్ 13న శోభనం రోజు తన భార్యకు పాలలో మత్తుమందు కలిపి తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయిన తరవాత గదిలోకి తీసుకెళ్లి ఒకరి తరవాత ఒకరు భర్త, అతని సోదరుడు, బావ, నలుగురు తాంత్రికులు అత్యాచారం చేశారు. ఆ తరవాత రోజు తాంత్రిక పూజల అనంతరం నవవధువును బలి ఇవ్వాలన్నది వారి ప్లాన్. అయితే ఈ నరకం నుంచి బయటపడిన నవవధువు విషయాన్ని తన తండ్రికి చెప్పింది. దీంతో ఆయన కురుక్షేత్ర పోలీసులను ఆశ్రయించారు. 

కురుక్షేత్ర పోలీసులు ఈ కేసును మహిళా పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 26న ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ శీలావతి స్పష్టం చేశారు. అమ్మాయి వద్ద నుంచి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపామని చెప్పారు. రిపోర్టు వచ్చిన తరవాత యాక్షన్ తీసుకుంటామని అన్నారు. అయితే ఈ కేసులో అమ్మాయి భర్త, అతని సోదరుడు, సోదరి, బావ, తల్లి, తండ్రి, నలుగురు తాంత్రికులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినా ఇంత వరకూ ఎవరినీ అరెస్టు చేయలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios