Asianet News TeluguAsianet News Telugu

కేరళలో మరో దారుణం: బాలికను సజీవదహనం చేసి యువకుడి ఆత్మహత్య

కొచ్చి నగరంలోని కక్కానాడులో ఉంటున్న 17 ఏళ్ల బాధితురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  దీనిని గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటీక లాభం లేకుండా పోయింది.

man sets girl on fire, dies along with her in kerala
Author
Kochi, First Published Oct 10, 2019, 3:43 PM IST

ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కోడలే అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన మరచిపోకముందే కేరళలో మరో ఘటన జరిగింది. ఓ బాలికను సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

కొచ్చి నగరంలోని కక్కానాడులో ఉంటున్న 17 ఏళ్ల బాధితురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.  దీనిని గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటీక లాభం లేకుండా పోయింది.

ఈ ఘటనలో తండ్రికి సైతం గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పర్వూర్‌కు చెందిన మిథున్ అనే యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ధ్రువీకరించారు.

అయితే బాలికను సజీవ దహనం చేసిన వెంటనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సంబంధం, ఈ ఘటనకు దారితీసిన వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios