కేరళలో మరో దారుణం: బాలికను సజీవదహనం చేసి యువకుడి ఆత్మహత్య
కొచ్చి నగరంలోని కక్కానాడులో ఉంటున్న 17 ఏళ్ల బాధితురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనిని గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటీక లాభం లేకుండా పోయింది.
ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యులను కోడలే అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన మరచిపోకముందే కేరళలో మరో ఘటన జరిగింది. ఓ బాలికను సజీవ దహనం చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
కొచ్చి నగరంలోని కక్కానాడులో ఉంటున్న 17 ఏళ్ల బాధితురాలి ఇంటికి వెళ్లిన ఓ యువకుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీనిని గమనించిన బాలిక తండ్రి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినప్పటీక లాభం లేకుండా పోయింది.
ఈ ఘటనలో తండ్రికి సైతం గాయాలు కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పర్వూర్కు చెందిన మిథున్ అనే యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
అయితే బాలికను సజీవ దహనం చేసిన వెంటనే నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. వీరిద్దరి మధ్య సంబంధం, ఈ ఘటనకు దారితీసిన వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.