Asianet News TeluguAsianet News Telugu

ayodhya verdict: తుది తీర్పు వెలువరించిన జడ్జిల నేపధ్యం ఇదే

భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో కూడుకున్న ధర్మాసనం, ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డి.వై.చంద్రచుడ్, జస్టిస్ ఎస్‌ఐ నజీర్లతో కూడిన దశాబ్దాల నాటి చారిత్రాత్మక తీర్పును శనివారం తీర్పును ఇవ్వనున్నారు.

Know the five judges who will deliver the Supreme Court judgement
Author
Hyderabad, First Published Nov 9, 2019, 11:38 AM IST

న్యూ ఢిల్లీ : భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తులతో  కూడుకున్న ధర్మాసనంలో  ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడిన జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ ఎస్‌ఐ నజీర్‌లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం శనివారం రామ్‌జనంభూమి-బాబ్రీ మసీదు అయోధ్య కేసుపై దశాబ్దాల చారిత్రక తీర్పును తెలుపనుంది. ఆగస్టు 6నుండి  ప్రారంభమైన ఈ విషయంపై 40 రోజుల పాటు రోజువారీ విచారణ తర్వాత ప్యానెల్ అక్టోబర్ 17 న తీర్పును రిజర్వు చేసింది.


 భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్:


సిజెఐ రంజన్ గొగోయ్ 46వ, సుప్రీం కోర్ట్  ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు.  ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీకాలం నవంబర్ 17, 2019 తో ముగుస్తుంది. ఈశాన్య భారతదేశం నుండి భారత ప్రధాన న్యాయమూర్తి అయిన మొదటి వ్యక్తి ఆయన. రంజన్ గొగోయ్ 1978 లో బార్‌లో చేరాడు తరువాత గౌహతి హైకోర్టులో  ప్రాక్టీస్ చేశాడు.

అక్కడ అతన్ని ఫిబ్రవరి 28, 2001 న శాశ్వత న్యాయమూర్తిగా నియమించారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ చేశారు. 12 ఫిబ్రవరి  2011న దాని ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 23 ఏప్రిల్  2012న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. దీపక్ మిశ్రా తరువాత 3 అక్టోబర్  2018న భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

also read Ayodhya verdict:అయోధ్య నిర్మాణానికి లైన్ క్లియర్

జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే:

జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే నవంబర్ 17న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తరువాత నియమితులవుతారు. అతను మధ్యప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆయన 23 ఏప్రిల్ 2021న పదవీ విరమణ చేయనున్నారు. అతను నాగ్‌పూర్‌కు చెందినవాడు.

జస్టిస్ బొబ్డే 1998 లో సీనియర్ న్యాయవాది అయ్యారు మరియు 2000లో బొంబాయి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పనిచేశారు. 2012 లో మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేరి, 2013 లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు.

aslo read Ayodhya verdict:మందిరాన్ని కూల్చిన ఆధారాలు లేవు


జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్:


జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ అలహాబాద్ హైకోర్టు, బొంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా పనిచేశారు. అతను భారతదేశానికి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి వై.వి.చంద్రచూడ్ కుమారుడు. అతను 31 అక్టోబర్  2013 నుండి భారత సుప్రీంకోర్టుకు నియామకం వరకు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. 13 మే 2016న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

అతను ముంబై విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఓక్లహోమా యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ లాలో తులనాత్మక రాజ్యాంగ చట్టం యొక్క విజిటింగ్ ప్రొఫెసర్‌గా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. సుప్రీంకోర్టులో జస్టిస్ చంద్రచూడ్ తన పదవీకాలంలో తులనాత్మక చట్టం, రాజ్యాంగ చట్టం, మానవ హక్కుల చట్టం, లింగ న్యాయం, ప్రజా ప్రయోజన వ్యాజ్యం మరియు క్రిమినల్ చట్టంపై పెద్ద సంఖ్యలో మైలురాయి తీర్పులు ఇచ్చారు.

also read Ayodhya verdict: తీర్పు ఏకగ్రీవం , తుది తీర్పు ముఖ్యాంశాలు ఇవే..

 

జస్టిస్ అశోక్ భూషణ్:


జస్టిస్ అశోక్ భూషణ్ 1979లో ఉత్తరప్రదేశ్ బార్ కౌన్సిల్ తో తన వృత్తిని ప్రారంభించారు తరువాత అతను అలహాబాద్ హైకోర్టులో సివిల్ మరియు ఒరిజినల్ వైపు ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. అతను 24 ఏప్రిల్  2001న అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఎదిగారు. జస్టిస్ భూషణ్ కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా జూలై 10, 2014 న నియమితులయ్యారు. 2014 ఆగస్టు 1న యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా, 2015 మార్చి 26న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

aslo read Ayodhya Verdict:అయోధ్యపై సుప్రీం తీర్పు: సున్నీ వక్ప్ బోర్డు పిటిషన్ కొట్టివేత

జస్టిస్ అబ్దుల్ నజీర్:


జస్టిస్ అబ్దుల్ నజీర్ 1983 లో న్యాయవాదిగా చేరాడు. బెంగళూరులోని కర్ణాటక హైకోర్టులో ప్రాక్టీస్ చేశాడు. మే 2003లో అతను కర్ణాటక హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా  పనిచేశాడు తరువాత అదే హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడ్డాడు.

ఫిబ్రవరి 2017లో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తు, అబ్దుల్  నజీర్‌ భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎదిగారు. అతను మొదట ఏ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయకుండా, ఈ విధంగా ఎదిగిన మూడవ న్యాయమూర్తి ఆయన. అబ్దుల్ నజీర్ ను 13 మే 2016 న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించారు.

Follow Us:
Download App:
  • android
  • ios