Asianet News TeluguAsianet News Telugu

మూగజీవాలని వదలని కామాంధులు... కుక్కపై నలుగురి గ్యాంగ్ రేప్

దేశంలో మహిళలు, చిన్నారులపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు చివరికి మూగ  జీవాలను కూడా వదలడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు వ్యక్తులు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు. 

dog raped by 4 men in Mumbai
Author
Mumbai, First Published Nov 20, 2018, 8:48 AM IST

దేశంలో మహిళలు, చిన్నారులపై ఆఘాయిత్యాలకు పాల్పడుతున్న కామాంధులు చివరికి మూగ  జీవాలను కూడా వదలడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయిన నలుగురు వ్యక్తులు కుక్కపై అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. ముంబైలోని మాల్వాని చర్చ్ ప్రాంతంలో తిరిగే కుక్క ఓ రోజు కనిపించలేదు.

ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున అటుగా వెళ్తున్న సుధా ఫెర్నాండెజ్ అనే వణ్యప్రాణి సంరక్షకురాలికి తీవ్ర రక్త స్రావంతో కుంటుతూ నడుస్తున్న కుక్క అత్యంత దయనీయ స్ధితిలో కనిపించింది. ఆమె దాని కాలిని తాకేందేకు ప్రయత్నించగా.. భయపడుతూ, దూరంగా జరిగింది.

తరువాత దానికి ఆహారం పెట్టి కుక్క శరీరాన్ని పరిశీలించగా.. దాని మర్మావయవాల నుంచి తీవ్ర రక్తస్రావం అవుతోంది, పడుకోవడానికి కూడా తీవ్రంగా ఇబ్బందిపడుతోంది. దీంతో సుధా కుక్కను తీసుకుని ఆసుపత్రికి వెళ్లింది. దానిని పరీక్షించిన వైద్యులు... కుక్కపై అత్యాచారం జరిగిందని ధ్రువీకరించారు.

కుక్క కాళ్లని తాడుతో కట్టేసి.. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడ్డారని చెప్పారు. జరిగిన సంఘటనపై సుధా ఫెర్నెండెజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. శనివారం తెల్లవారుజామున ఓ ఆటోడ్రైవర్ తనకు ఫోన్ చేశాడని.. ఓ కుక్కపై నలుగురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ సమయంలో వారు మాదక ద్రవ్యాలు సేవించి ఉన్నారని తెలిపాడు.. తాను ఆ కుక్కను వెతుక్కుంటూ వెళ్లానని సుధా వెల్లడించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..  కామాంధులను వెతుకుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios