Asianet News TeluguAsianet News Telugu

యువతిపై గ్యాంగ్ రేప్, గొంతు పిసికేసి హత్య.. నేరం వేరేవారిపై వేసేందుకు కుట్ర

పాతికేళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆ యువతి గొంతు పిసికి హత్య చేశారు.

Delhi: 4 men arrested for gangraping, strangulating woman to death
Author
Hyderabad, First Published Mar 5, 2019, 12:01 PM IST

పాతికేళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆ యువతి గొంతు పిసికి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన దేశరాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. కాగా... ఈ కేసుకి సంబంధించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. గత నెల ఫిబ్రవరి 27వ తేదీన ఢిల్లీకి చెందిన ఓ యువతి అత్యాచారిని గురైంది. కాగా.. అనంతరం ఆ యువతి గొంతు పిసికి.. హత్య చేసి.. మృతదేహాన్ని ఒక చోట పడేశారు. కాగా.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో.. యువతి డెడ్ బాడీ వద్ద ఓ లెటర్, మొబైల్ ఫోన్ కనిపించాయి.

శవం దగ్గర దొరికిన లెటర్ లో తన చావుకు కారణం వీరే అంటూ.. ముగ్గురి పేర్లు రాసి ఉన్నాయి. అయితే.. ఆ ముగ్గురికి ఈ యువతికి ఎలాంటి సంబంధం లేకపోవడం పోలీసులను ప్రశ్నార్థకంలో పడేసింది. దీంతో.. దర్యాప్తును పోలీసులు మరింత వేగవంతం చేయగా.. అసలు నిజం బయటపడింది.

దినేష్, ధీరేందర్ అనే ఇద్దరు యువకులు మరో ఇద్దరితో కలిసి యువతిపై అత్యాచారంచేసి.. ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ముగ్గురిని ఇరికించినట్లు తేలింది. తమకు వ్యక్తిగతంగా శత్రువులైన వారికి ఈ కేసులో ఇరికించేందుకు యువతితో అలా ఉత్తరం రాయించినట్లు తెలిసింది. సదరు బాధిత యువతి దినేష్ గర్ల్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ అని పోలీసుల విచారణలో తేలింది.

ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతురాలి ఫోన్ నుంచి ఎలాంటి సంబంధం లేని ఓ వ్యక్తికి పలు మార్లు ఫోన్ చేసి వారిని ఇరికించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios