Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణికులపైకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకువెళ్లగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. 

Car Runs Over People Waiting For Bus In Maharashtra, 4 Killed
Author
Hyderabad, First Published Nov 17, 2018, 1:00 PM IST

బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకువెళ్లగా.. నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్రలోని థానేలో శనివారం ఉదయం చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. థానేలోని షహన్ పూర్ ప్రాంతానికి చెందిన కొందరు నాసిక్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో.. అటువైపుగా వస్తున్న కారు అదుపుతప్పి ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు.

మృతుల్లో 16ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. క్షతగాత్రుల్లో ఇద్దరు మైనర్ బాలికలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  స్థానిక ఎమ్మెల్యే పాండురంగ బరోరా.. క్షతగాత్రులను పరామర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios