మోతీనగర్లో కుప్పకూలిన భవనం.. ఏడుగురి దుర్మరణం
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్ సుదర్శన్ పార్క్ వద్ద గల ఓ మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం గురువారం రాత్రి 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం సంభవించింది. మోతీనగర్ సుదర్శన్ పార్క్ వద్ద గల ఓ మూడంతస్తుల ఫ్యాక్టరీ భవనం గురువారం రాత్రి 9 గంటల సమయంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలవ్వగా.. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మరిన్ని శిధిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.