చిదంబరానికి ఊరట: ఫిబ్రవరి 1వరకు నో అరెస్ట్
ఎయిర్సెల్- మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన కొడుకు ఊరట లభించింది.
న్యూఢిల్లీ: ఎయిర్సెల్- మ్యాక్సిస్ కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన కొడుకు ఊరట లభించింది. ఈ కేసులో చిదంబరంతో పాటు ఆయన తనయుడు కార్తీని ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ వరకు అరెస్ట్ చేయకూడదని న్యూఢిల్లీ కోర్టు ఆదేశించింది.
ఈ కేసు విచారణ చేసిన కోర్టు ఫిబ్రవరి 1వ తేదీ వరకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ కేసు వాయిదా వరకు వీరిద్దరిని కూడ అరెస్ట్ చేయకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
చిదంబరం కేంద్ర ఆర్ధిక మంత్రిగా ఉన్న సమయంలో ఎయిర్సెల్-మ్యాక్సిస్ డీల్లో విదేశాల నుండి నిధులు పెట్టుబడి పెట్టే విషయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.