Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో ఎన్ కౌంటర్.. ముగ్గురు క్రిమినల్స్ హతం

దేశరాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం పోలీసులకు, నేరస్థులకు భీకర పోరు జరిగింది.

5 Men Wanted In Murder Cases Caught By Delhi Police After Shootout
Author
Hyderabad, First Published Feb 11, 2019, 9:39 AM IST

దేశరాజధాని ఢిల్లీలో సోమవారం ఉదయం పోలీసులకు, నేరస్థులకు భీకర పోరు జరిగింది. ఈ పోరులో ముగ్గురు క్రిమిన్సల్ హతమయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 10 లోని స్వర్ణ జయంతి పార్కు వద్ద నీరజ్ బవానియా గ్యాంగ్ కు చెందిన నేరగాళ్లు దాడి చేసేందుకు వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురికి బుల్లెట్ గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించగా వారు అప్పటికే మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. 

ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు పోలీసులకు బుల్లెట్లు తగిలినా, వారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించడంతో ముప్పు తప్పిందని డీసీపీ సంజీవ్ యాదవ్ చెప్పారు. ఈ ఎన్ కౌంటర్ అనంతరం ఇద్దరు నేరస్థులను అదుపులోకి తీసుకున్నామని డీసీపీ చెప్పారు. ఈ ఘటనలో దోపిడీ దొంగలైన అర్పిత్ ఛిత్లార్, సునీల్ భూరా, సుఖ్విందర్ లు గాయపడ్డారని డీసీపీ వివరించారు. సంఘటన స్థలంలో పోలీసులు పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios