Asianet News TeluguAsianet News Telugu

ఏమైందో: ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మృతుల్లో 12 రోజుల పాప కూడా ఉంది.  మహిళతో పాటు మరో ముగ్గురు మరణించారు. పాప ఆ మహిళ కూతురు.

4 Members Of Family, Including 12-Day-Old Infant, Found Dead Near Bhopal
Author
Bhopal, First Published Jan 23, 2019, 8:01 AM IST

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ కు సమీపంలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. మృతుల్లో 12 రోజుల పాప కూడా ఉంది.  మహిళతో పాటు మరో ముగ్గురు మరణించారు. పాప ఆ మహిళ కూతురు.

మహిళ భర్త పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పోలీసులు చెప్పారు. మహిళ తల్లి, ఆమె సోదరుడు కూడా విగతజీవులై కనిపించారు. ఈ సంఘటన భోపాల్ కు 43 కిలోమీటర్ల దూరంలో రైసెన్ లోని వారింట్లోనే జరిగింది. 

మహిళ భర్త ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతని ప్రాణాలకు ముప్పు లేదని పోలీసులు చెప్పారు. అతని భార్య, 12 రోజులు కూతురు, అత్త, బావమరిది మరణించారు. వారి మరణానికి కారణమేమిటో తెలియడం లేదని. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios