చిల్లర కోసం ఎగబాడిన భక్తులు, తొక్కిసలాట: 10 మంది మృతి
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. తిరుచ్చిలోని ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో చైత్రమాస ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి.
తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఆలయంలో తొక్కిసలాట జరిగి ఏడుగురు భక్తులు దుర్మరణం పాలయ్యారు. తిరుచ్చిలోని ముత్యంపాలయంలో ఉన్న కురుప్ప స్వామి ఆలయంలో చైత్రమాస ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతాయి.
ఈ సందర్బంగా భక్తులకు హుండీలోని చిల్లర నాణేలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం అర్చకులు నాణేలను పంచుతుండగా.. భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.
మరణించిన వారు కరూర్, కడలూరు, సేలం, నమక్కల్, విల్లుపురం జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.