బీజేపీకి ఓట్లు అక్కర్లేదు.. రిగ్గింగులు చాలు: మాయావతి
బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయవతి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. తొలి దశ ఎన్నికల పోలింగ్లో బీజేపీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ ఆమె ఫైరయ్యారు.
బీజేపీపై బీఎస్పీ అధినేత్రి మాయవతి తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. తొలి దశ ఎన్నికల పోలింగ్లో బీజేపీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందంటూ ఆమె ఫైరయ్యారు. ఎన్నికల సంఘం తన తీరును సరిచేసుకోవాలని... మిగిలిన దశల్లో తన బాధ్యతను సరిగా నిర్వర్తించాలని కోరారు.
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ తిరస్కరిస్తుండటంతో ఆ పార్టీ ఇప్పుడు ఓట్లకు బదులు రిగ్గింగులు, అధికార దుర్వినియోగంతో మరోసారి గెలవాలనుకుంటున్నది అంటూ మాయావతి ట్వీట్ చేశారు.