పపువా న్యూగినియాలో భూకంపం, 7.2 తీవ్రత
పపువా న్యూగినియాలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది
పపువా న్యూగినియాలో మంగళవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. బులాలో నగరానికి 33 కిలోమీటర్లు, దేశ రాజధాని పోర్ట్ మోర్స్బైకి 250 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది.
భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. గాఢనిద్రలో ఉన్న ప్రజలు ఇళ్లలోని వస్తువులు కదిలినట్లుగా అనిపించడంతో ప్రాణభయంతో రోడ్ల మీదకు పరుగులు తీశారు.