Asianet News TeluguAsianet News Telugu

కెన్యాపై ఉగ్రపంజా: ఆత్మాహుతి దాడిలో 15 మంది బలి

విదేశీయులనే లక్ష్యంగా చేసుకుని కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విదేశీయులు ఎక్కువగా నివాసముండే ఓ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడి 15 మందిపి పొట్టపపెట్టుకున్నారు. అలాగే మరికొంత  మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

15 dead in Kenya hotel terror attack
Author
Nairobi, First Published Jan 16, 2019, 10:09 AM IST

విదేశీయులనే లక్ష్యంగా చేసుకుని కెన్యా రాజధాని నైరోబిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. విదేశీయులు ఎక్కువగా నివాసముండే ఓ హోటల్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడి 15 మందిపి పొట్టపపెట్టుకున్నారు. అలాగే మరికొంత  మంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా వుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఈ దారుణానికి  సంబందించిన వివరాలిలా ఉన్నాయి. నైరోబీలోని వెస్ట్‌లాండ్స్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ‘డస్టిట్‌డీ2’హోటల్ ప్రాంగణంలోకి మారణాయుధాలతో ప్రవేశించారు. హోటల్ కు వచ్చే  వాహనాలను నిలిపివుంచే పార్కింగ్ ప్రాంతంపై బాంబులు విసిరారు. అంతేకాకుండా విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అంతేకాకుండా ఓ ముష్కరుడు తనను తాను పేల్చుకున్నాడు. ఇలా అన్ని వైపుల నుండి...అన్ని రకాలుగా దాడులు జరపడంతో తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. 

ఈ దాడిలో దాదాపు 15 మంది అమాయకులు మృతిచెంది వుంటారని తెలుస్తోంది. అయితే ముష్కరులు హోటల్లోకి ప్రవేశించి వుంటే మరింత ప్రాణనష్టం జరిగివుండేది.   

ఈ దాడులకు తెగబడింది తామేనంటూ ‘అల్‌-షబాబ్‌’ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. దాడిపై సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న భద్రతాబలగాలు సహాయక చర్యలు చేపట్టారు. హోటల్ ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.  
  
 

Follow Us:
Download App:
  • android
  • ios