Asianet News TeluguAsianet News Telugu

హైదరబాద్ లో మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచర్స్

  • సరూర్ నగర్ లో రెచ్చిపోయిన గొలుసు దొంగలు
  • రోడ్డుపై మహిళ మెడలోంచి బంగారు గొలుసు అపహరణ
saroornagar chain snatching

హైదరాబాద్ లో మరో సారి గొలుసు దొంగలు రెచ్చిపోయారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకి ఎన్ క్లేవ్ కాలనీ లో ఓ ఒంటరి మహిళ మెడలోంచి బంగారు గొలుసు లాక్కెళ్లారు.
ఈ స్నాచింగ్ వివరాలిలా ఉన్నాయి. జానకి ఎన్ క్లేవ్ లో నివాసముండే రాధ(52) అనే మహిళ దేవాలయానికి నడుచుకుంటూ వెల్లుతోంది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు బైక్ పై వెంబడించి, అదునుచూసుకుని మెడ లోనుండి మూడు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. దీంతో భాధిత మహిళ స్థానిక పోలీసులకు పిర్యాదు చేసింది.
బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు ఈ చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు, వారు ముఖాలకు మాస్కులు ధరించినట్లు భాధితురాలు తెలిపింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios