Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు శుభవార్త... వైద్యారోగ్య శాఖలో ఖాళీల భర్తీపై సీఎం ఆదేశం

అమరావతి వేదికన ద్యారోగ్య శాఖ అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ను వైద్యాంధ్రప్రదేశ్ గా మార్చేలా తమ ప్రయత్నం వుండాలని జగన్ అధికారులకు సూచించారు.  

andhra pradesh cm jagan review meeting on health department
Author
Amaravathi, First Published Oct 18, 2019, 4:03 PM IST

అమరావతి: ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ సమీక్ష నిర్వహించారు. కంటివెలుగు, ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో అభివృద్ధి కార్యక్రమాలు, మాతా శిశుమరణాల నివారణ సహా పలు అంశాలపై సంబధిత అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రాన్ని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ గా తీర్చిదిద్దడానికి ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని  ముఖ్యమంత్రి సూచించారు. 

వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ ప్రమాణాల ప్రకారం మందుల తయారీ, అందుబాటులో మందులను ఉంచడం, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సహాయం అందించడం, తీవ్రవ్యాధులతో సతమతం అవుతున్న వారికి ప్రతినెలా పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాలు కొనుగోలు, ఆస్పత్రుల అభివృద్ధి తదితర పనులు చేయడం ద్వారా ఆరోగ్యరంగాన్ని బలోపేతం చేయవచ్చని సీఎం అధికారులకకు సూచించారు.

నవంబర్‌ 1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లోని ఆరోగ్యశ్రీ కింద 150 ఆస్పత్రుల్లో సూపర్‌స్పెషాలిటీ సేవలు  అందించనున్నట్లు నిర్ణయించారు. డిసెంబర్‌ 1నుంచి శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునేంతవరకూ ఆర్థిక సహాయం అందెలా చర్యలు తీసుకోవాలకు అధికారులను సీఎం ఆదేశించారు.

andhra pradesh cm jagan review meeting on health department

నెలకు రూ.5వేలు లేదా రోజుకు రూ.225 అందించాలని సూచించారు. తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధులతో బాధపడుతున్న వారికి  రూ.10వేల సాయం వర్తింపు చేయాలని సీఎం ఆదేశించారు. రూ. 5వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చాలని జగన్ సూచించారు.

 తీవ్ర పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైనవారికీ, రెండు కాళ్లు లేక చేతులు లేనివారు లేక పనిచేయని స్థితిలో ఉన్నవారికీ, కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్నవారికి రూ.5వేల పెన్షన్‌ వర్తింపజేయాలన్నారు. జనవరి 1 నుంచి వీరికి పెన్షన్‌ అందేలా చూడాలని ఆదేశించారు. 

పైలెట్ ప్రాజెక్ట్ కింద పశ్చిమ గోదావరి జిల్లాలో  2వేల వ్యాధులకు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్య శ్రీ  అమలు  చేయనున్నట్లు తెలిపారు.  డెంగ్యూ, సీజనల్‌ వ్యాధులకు ఇందులో చోటు కల్పించాలని ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి సూచించారు. 

గిరిజన ప్రాంతాల్లో బైకుల ద్వారా వైద్యసేవలను అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో కూడా ఏదోరకంగా వేద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటయినా ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని సీఎం ఆదేశించారు.

అన్ని కమ్యూనిటీ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని... డిసెంబర్‌ 2019 నుంచి పనులు ప్రారంభించి 2020 డిసెంబర్‌ నాటికి ఈ పనులు పూర్తిచేయాలన్నారు. 

video: గృహనిర్మాణంపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష...

బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధంచేయాలని అధికారులకు సీఎం సూచించారు.  అలాగే ఆస్పత్రుల్లో మందులకు కొరతలేకుండా, మందులు నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.  మందులు దొరకడంలేదన్న కంప్లైంట్‌ ఎక్కడా రాకూడదని గట్టిగా హెచ్చరించారు.

 హెల్త్‌ సబ్‌సెంటర్లలో అభివృద్ది కార్యక్రమాలు కూడా వచ్చే మే నుంచి పనులు ప్రారంభమవ్వాలని ఆదేశించారు.  ఆరోగ్యశ్రీలో డబుల్‌ కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ను చేర్చాలని సూచించారు. డిసెంబర్‌ 21న ఆరోగ్యకార్డుల జారీ కార్యక్రమం చేపట్టాలని సూచించారు.

ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్లకు రూ.16వేలు పెంచేలా వెంటనే జీవో జారీచేయాలని సీఎం ఆదేశించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని కాలేజీల పిల్లలకూ వర్తింప చేయాలని సూచింంచారు. నెలరోజుల్లో కాలేజీ పిల్లలకూ పరీక్షలు చేయాలని సూచించారు. కంటి వెలుగు కార్యక్రమం మాదిరిగానే ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు చేయాలన్నారు.స్కూలు పిల్లనుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాలన్నారు. మధుమేహం, బీపి, షుగర్‌ లాంటి వ్యాధులను తగ్గించడానికి తగిన కార్యక్రమాలు స్కూళ్లు, గ్రామాల్లో నిర్వహించాలని కోరారు. 

రాజధానిగా అమరావతి డౌటే, సాకులు చెప్తున్న ప్రభుత్వం: బొత్స సంచలన వ్యాఖ్యలు...

అన్ని జాతీయ రహదారుల్లో మద్యం దుకాణాలను తొలగించాలని ఆదేశించారు. మద్యం దుకాణాల కోసం గతంలో కొన్నిటిని డీనోటిఫై చేశారని ప్రస్తావించారు. వాటిని తిరిగి జాతీయ రహదారుల జాబితాలో యాడ్‌ చేయాలని సూచించారు.
 
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డవారు ఆస్పత్రికి వస్తే... డబ్బుకోసం వేచిచూడాల్సిన అవసరంలేదనే రీతిలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం నుంచే కొంతమొత్తాన్ని దీనికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారుచేయాలని ఆదేశించారు. త్వరలోనే ఈ కార్యక్రమాన్ని ప్రకటించాలని సూచించారు. అలాగే వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలుపెట్టాలన్న సీఎం ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios