Asianet News TeluguAsianet News Telugu

2018 సివిల్స్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు విడుదల

2018 సివిల్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1994 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. 

civil services 2018 mains results
Author
Delhi, First Published Dec 20, 2018, 6:23 PM IST

2018 సివిల్ మెయిన్స్ పరీక్షా ఫలితాలను యూపీఎస్సీ విడుదల చేసింది. 2018 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 7 వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 1994 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకి ఎంపికయ్యారు. వీరికి వచ్చే ఏడాది ఫిబ్రవరి 4 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్‌)లో ఉద్యోగాల నియామకాల కోసం మెయిన్స్ పరీక్షను నిర్వహించారు. ఇంటర్వ్యూకి సంబంధించి జనవరి 9 నుంచి షెడ్యూల్ వివరాలను కమీషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. 
ఫలితాల కోసం upsc.gov.in, upsconline.nic.in వెబ్‌సైట్‌ని క్లిక్ చేయండి.
 

Follow Us:
Download App:
  • android
  • ios