ట్రైలర్ లో 'రత్తాలు' హాట్ గా రెచ్చిపోయిందే..!
చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో 'రత్తాలు రత్తాలు'అనే ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లినా రత్తాలు అని పిలిచేటంత క్రేజ్ తెచ్చిపెట్టిందీ సాంగ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్...సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ ఆమె చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో 'రత్తాలు రత్తాలు'అనే ఐటమ్ సాంగ్ ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్లినా రత్తాలు అని పిలిచేటంత క్రేజ్ తెచ్చిపెట్టిందీ సాంగ్. ఆ తర్వాత పవన్ కళ్యాణ్...సర్దార్ గబ్బర్ సింగ్ లోనూ ఆమె చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
అయితే చిత్రంగా చిరంజీవి, పవన్ లాంటి స్టార్స్తో ఐటం సాంగ్స్ చేసిన తర్వాత కూడా ఎందుకో కానీ తెలుగులో బిజీ కాలేకపోయింది . నటిగా ఆఫర్స్ పెద్దగా రాకపోవటంతో.. గ్లామర్ నే నమ్ముకుందామని ఫిక్సై... అందాల ఆరబోత పోగ్రాం పెట్టుకుందీ ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తెలుగులో వేర్ ఈజ్ వెంకటలక్ష్మి, కర్రిబాబ్జీ లాంటి సినిమాలు చేస్తుంది లక్ష్మీ రాయ్.
లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి’. రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్లుక్కి మంచి రెస్పాన్స్ రాగా తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసింది చిత్రయూనిట్. 2 నిమిషాల 16 సెకనుల నిడివితో కూడిన ఈ ట్రైలర్లో రొమాంటిక్ సన్నివేశాలతో పాటు హార్రర్ క్లిపింగ్స్ జోడించి అన్నీ చూపిస్తూ ఆసక్తి రేకెత్తించారు.
ఈ ట్రైలర్ లో రాయ్ లక్ష్మి గ్లామర్ స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది. హాస్యనటులు ప్రవీణ్, మధునందన్లు రాయ్ లక్ష్మి వెంటపడటం, ఆ ముగ్గురి మధ్య షూట్ చేసిన కొన్ని సన్నివేశాలు యువతను బాగా ఆకట్టుకుంటున్నాయి.