Asianet News TeluguAsianet News Telugu

తమన్నా సినిమాకీ గొడవ తప్పేటట్లు లేదు..

కంగనా ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'మణికర్ణిక' డైరెక్టర్ ఎవరనే విషయంలో ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. సినిమాను తాను తెరకెక్కిస్తే కంగనా ఆ క్రెడిట్ ను తీసుకుంటుందని క్రిష్ ఆరోపిస్తున్నాడు. 

That is Mahalakshmi movie completed by two directors
Author
Hyderabad, First Published Feb 4, 2019, 10:13 AM IST

కంగనా ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'మణికర్ణిక' డైరెక్టర్ ఎవరనే విషయంలో ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. సినిమాను తాను తెరకెక్కిస్తే కంగనా ఆ క్రెడిట్ ను తీసుకుంటుందని క్రిష్ ఆరోపిస్తున్నాడు. దాదాపు డబ్బై ఐదు శాతం సినిమాను తాను తెరకెక్కిస్తే.... కంగనా కేవలం ప్యాచ్ వర్క్ మాత్రమే చేసింది అంటూ క్రిష్ విమర్శలు చేసారు. ఈ విషయమై కంగనా సైతం ఛాలెంజ్ లు విసిరింది. తాను మేజర్ పార్ట్ షూటింగ్ చేసానంది.

అయితే.. ఇలాంటి వివాదమే త్వరలో తమన్నా ప్రధాన పాత్రలో నటించిన  'దటీజ్ మహాలక్ష్మి' విషయంలో కూడా వచ్చే అవకాశం ఉందని మీడియాలో గుప్పు మంది. దానికి తోడు ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ లో డైరక్టర్ పేరు వేయలేదు.  వివరాల్లోకి వెళితే.. బాలీవుడ్లో కంగనా రనౌత్ ముఖ్య పాత్ర పోషించిన 'క్వీన్' సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సినిమా నాలుగు సౌత్ భాషల్లోనూ  రీమేక్ అవుతోంది.

ఆ క్రమంలో  తెలుగు భాషలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. 'దటీజ్ మహాలక్ష్మి' టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి మొదట నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరక్టర్ నీలకంఠ  దర్శకత్వం వహించారు. అసలు లోగుట్టు కారణాలు తెలియదు కానీ ఆయన సినిమా నుండి తప్పుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమాకు 'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు.

అయితే ఈ సినిమాలో సగం క్రెడిట్ నీలకంఠ కు దక్కాలంటున్నారు.  మరో వైపు ప్రశాంత్ వర్మ కూడా తనకు క్రెడిట్ దక్కుతుందని అనుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తమన్నా మాత్రం నీలకంఠ సినిమా నుండి తప్పుకోవడంలో తన ప్రమేయం ఏమీ లేదని ఈ సినిమా నుండి తప్పుకున్నప్పటికి తనతో ప్రెండ్లీ గానే ఉంటున్నారని చెప్పుకొస్తోంది. ఇంతకీ ఈ సినిమా క్రెడిట్ ఎవరికి దక్కుతుంది, ఏవైనా వివాదాలు చెలరేగుతాయా  అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గానే మిగిలింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios