‘మన్మథుడు 2’ లో ఆమెకు ఛాన్స్..నాగ్ కు ప్రశంసలు
అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2002లో వచ్చిన బ్లాక్బస్టర్ ‘మన్మథుడు’.
అక్కినేని నాగార్జున, త్రివిక్రమ్ కాంబినేషన్ లో 2002లో వచ్చిన బ్లాక్బస్టర్ ‘మన్మథుడు’. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ‘మన్మథుడు 2’ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపధ్యంలో చిత్రం గురించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అది విన్న వారంతా నాగ్ ని మెచ్చుకుంటున్నారు. అయితే ఆ వార్త నిజమో ..గాసిప్పో ఎవరికీ తెలియటం లేదు. ఇంతకీ ఆ వార్త ఏమిటీ అంటే..
‘మన్మథుడు 2’లో సోనాలిబింద్రేకు ఆఫర్ ఇచ్చారట. ‘మన్మథుడు’లో ఆమె నాగ్ కు జోడీగా కనిపించింది. ఈ నేపధ్యంలో ఆమె కనపడితే బాగుంటుందని టీమ్ భావించారుట. అయితే ఆమె కాన్సర్ సోకి ,ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండటంతో ఆ విషయం వదిలేసారట. కానీ నాగ్ మాత్రం ఆమెకు ఉత్తేజం ఇవ్వటానికి అయినా తన సినిమాలో ఆఫర్ ఇవ్వాలని నిర్ణయించుకుని , సోనాలి అడిగారని తెలుస్తోంది. అందుకు ఆమె మొదట తటపాయించినా, ఆ తర్వాత ఓకే అందిట. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం ఏమీ లేదు.
ఇక ఆ మధ్య కాన్సర్ రాగానే నాగ్ ఆమెకు ధైర్యం చెప్తూ ట్వీట్ చేసారు. దానికి సోనాలి రిప్లై ఇచ్చారు.‘క్యాన్సర్ను జయించాలన్న నీ గొప్ప సంకల్పానికి బలం చేకూరి నువ్వు త్వరగా కోలుకోవాలి డియర్’ అంటూ అక్కినేని నాగార్జున పెట్టిన ట్వీట్కు ‘నాగ్ థ్యాంక్యూ’ అంటూ రిప్లై ఇచ్చింది సోనాలి.
మనం ఎంటర్ప్రైజెస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకాలపై నాగార్జున, జెమిని కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్ప్రీత్ సింగ్, పాయల్రాజ్పుత్ హీరోయిన్స్ . ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ఏప్రిల్ 4 వరకూ సాగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 12కి చిత్ర యూనిట్ పోర్చుగల్ ప్రయాణం అయ్యారు. ఇందులో నాగార్జున భార్యగా రకుల్ ప్రీత్ కనిపించనున్నారని తెలుస్తోంది.