ఇక గ్రాఫిక్స్ కి దూరంగా ఉంటా.. నెక్స్ట్ రెండు సినిమాలు అవే: 2.0 డైరెక్టర్ శంకర్
శంకర్ ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఒక వివరణ ఇచ్చాడు. అదే విధంగా ఆ సినిమాల కోసం ఎక్కువగా గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఇవ్వనని వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటానని చెప్పారు.
ప్రస్తుతం దేశమంతా ఉన్న సినీ అభిమానులు 2.0 సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ - రజినీకాంత్ నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన టీజర్ కు కూడా మంచి స్పందన వచ్చింది. నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు.
అయితే చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శంకర్ ఇటీవల బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ ప్రాజెక్టుల గురించి ఒక వివరణ ఇచ్చాడు. అదే విధంగా ఆ సినిమాల కోసం ఎక్కువగా గ్రాఫిక్స్ కి ప్రాధాన్యత ఇవ్వనని వీలైనంత వరకు వాటికి దూరంగా ఉంటానని చెప్పారు. ఎందుకేనట 2.0 విషయంలో విఎఫ్ఎక్స్ పనుల వల్ల బాగా తెలిసింది. సినిమా ఆలస్యం అవ్వడానికి అదే ప్రధాన కారణమవుతోంది.
అందుకే నెక్స్ట ఫిక్స్ చేసుకున్న రెండు ప్రాజెక్టుల విషయంలో ఎక్కువగా విఎఫ్ఎక్స్ ఉండవని శంకర్ వివరించాడు. నెక్స్ట్ భారతీయుడు 2 సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఒక సైన్స్ ఫిక్షన్ కథను శంకర్ తెరకెక్కిస్తాడట. ఆ ప్రాజెక్టు గురించి ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదని దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు.