Asianet News TeluguAsianet News Telugu

ఆదర్శంగా వుండాలి కదా రానా.. ఏంటి నానా

  • జోగేంద్రకు కోపం వచ్చింది... యాంకరమ్మపై చిందులేశాడు...
  • ఓ ఛానెల్ నేనే రాజు నేనే మంత్రి ప్రమోషన్ ఇంటర్వ్యూలో డ్రగ్స్ పై ప్రశ్న
  • అసందర్భం అంటూ యాంకర్ పై శివాలెత్తిన రానా, దడుసుకున్న యాంకరమ్మ
rana daggubati burst agt an interview of nene raju nene manthri promotion

తెలుగు సినీ పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ప్రత్యేక స్థానం. మూవీ మొఘల్ గా ఖ్యాతి సంపాదించిన దగ్గుబాటి రామానాయుడు.. తెలుగు సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి. రామానాయుడు వారసులుగా ఆ కుటుంబం నుంచి వచ్చిన సురేష్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా, వెంకటేశ్, రానాలు హీరోలుగా క్రేజ్ సంపాదించారు. టాలీవుడ్ టాప్ ఫ్యామిలీస్ లో ఒకటైన.. దగ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం నేనే రాజు నేనే మంత్రి. ఇప్పటికే ఈ మూవీకి తెగ ప్రమోషన్స్ చేస్తూ... సందడి చేస్తున్న రానాకు సడెన్ గా కోపం వచ్చింది.

 

తాజాగా, నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ లో భాగంగా రానా ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ రెడీ అయ్యాడు. ఇంటర్వ్యూకు వచ్చిన రానాని.. ఛానెల్ యాంకరమ్మ ఇటీవలే సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు గురించి ఓ ప్రశ్న అడిగింది. దాంతో ఇప్పుడు నేనే రాజు నేనే మంత్రి సినిమా ప్రమోషన్ కోసం వస్తే... ఇదేం అర్థంలేని ప్రశ్న అంటూ రానా కూడా ఆ లేడీ యాంకరమ్మ మీద ఫుల్ గా సీరియస్ అయ్యాడు. సెలెబ్రిటీ లు అంటే ఆటలుగా ఉందా అంటూ యాంకర్ పై శివాలెత్తాడు.

 

 

యాంకరమ్మ వెనకంజవేయలేదు.  మీక్కూడా ఏదో పార్శిల్ వచ్చిందని, ఎక్సైజ్ అధికారులు మీ స్టూడియోకి వచ్చారనే వార్తలు వచ్చాయి... అసలేం జరిగిందని ప్రశ్నించింది. దాంతో సినిమా ప్రమోషన్ కోసం వస్తే ఇవేం దిక్కుమాలిన ప్రశ్నలు.. అంటూ రానా చాలా సీరియస్ గా ఫేస్ పెట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు నచ్చని ప్రశ్న అసందర్భంగా అడగటంతో కంట్రోల్ తప్పిన రానా... యాంకర్ కు వేలు చూపి చిట్క వేస్తూ వేస్తూ పిచ్చి పిచ్చి ప్రశ్నలు అఢగొద్దు అంటూ హెచ్చరించాడు. దగ్గుబాటి ఫ్యామిలీ ఎలా కనిపిస్తోంది అంటూ సీరియస్ అయ్యాడు.

 

ఇటీవల డ్రగ్స్ కేసులో... మీడియా ఛానెళ్లు గోరంతలు కొండంతలు చేసి చూపిస్తున్నాయని ఛానెల్స్ పై రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్లు తమ అసహనం ప్రదర్శిస్తున్న ఘటనలు చూశాం. తాజాగా రానా ఆగ్రహం చూస్తే.. అంతటి సెలెబ్రిటీ ఇంత ఈజీగా కంట్రోల్ తప్పుతారా అని అనిపిస్తుంది. యాంకరమ్మ వేసే ప్రశ్నలు బయటి సమాజం నుంచే వచ్చాయి. అయినా... తమ పెతాపం చూపించడ సబబా?

 

అదే ఛానెల్ కు చెందిన ఓ యాంకర్ ఇటీవల ఓ కోలీవుడ్ టాప్ హీరోను కూడా ఇలాగే ప్రశ్నించి అతని ఆగ్రహానికి గురైంది. అయితే రానా ఒక యాంకర్ తో అలా ప్రవర్తించి ఉండాల్సింది కాదంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి వచ్చిన రానా హుందాగా వ్యవహరిస్తే బాగుండేదని అంతా అంటున్నారు. చాలా సింపుల్ గా కొశ్చన్ ఈ జ్ అవుటాఫ్ కాంటెక్స్ట్ అని చెప్తే సరిపోయేదని... రానా అలా రెచ్చిపోవడం సరికాదని జనం అనుకుంటున్నారు. బాహుబలితో గ్లోబల్ కీర్తి సంపాదించిన రానా లాంటి వాళ్లు.. ఆదర్శవంతంగా వుండాల్సింది పోయి.. ఇలా పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేయడం సరికాదనంటున్నారు. ఏదైమైనా.. ఈ మధ్య సెలెబ్రిటీలకు మీడియా పైన తెగ కోపమొస్తోందీ మధ్య. ఎందుకో ఆలోచించాలి

Follow Us:
Download App:
  • android
  • ios